సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ పెద్దమనసు చాటుకున్నారు. ఆయన తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ 13 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక అతని కుమారుడి పేరు మీద ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేవతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన కోమటిరెడ్డి, ఈ ఘటనపై సినీ పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.
ముఖ్యంగా, రేవతి కుటుంబానికి సాయం చేస్తానని మాట ఇచ్చిన అల్లు అర్జున్ తన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు రేవతి కుటుంబాన్ని పరామర్శించినా, సినీ పరిశ్రమ నుంచి తగిన స్పందన రాలేదని తెలిపారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నింటిని తెలంగాణ ప్రభుత్వం భరించనుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యయాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. గాయపడిన చిన్నారికి అత్యుత్తమ చికిత్స అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, థియేటర్లలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
This post was last modified on December 21, 2024 5:41 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…