సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ పెద్దమనసు చాటుకున్నారు. ఆయన తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ 13 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక అతని కుమారుడి పేరు మీద ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేవతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన కోమటిరెడ్డి, ఈ ఘటనపై సినీ పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.
ముఖ్యంగా, రేవతి కుటుంబానికి సాయం చేస్తానని మాట ఇచ్చిన అల్లు అర్జున్ తన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు రేవతి కుటుంబాన్ని పరామర్శించినా, సినీ పరిశ్రమ నుంచి తగిన స్పందన రాలేదని తెలిపారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నింటిని తెలంగాణ ప్రభుత్వం భరించనుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యయాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. గాయపడిన చిన్నారికి అత్యుత్తమ చికిత్స అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, థియేటర్లలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
This post was last modified on December 21, 2024 5:41 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…