Political News

వైసీపీలో వివాద‌మ‌వుతున్న యువ ఎంపీ

రాజ‌కీయాల్లో కొంత మంది నేత‌ల శైలి భిన్నంగా ఉంటుంది. వారు ఉన్న‌చోట వివాదాలు.. వివాదాలు ఉన్న చోట వారు ఉండ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు వివాదాల చుట్టూనే కాలం గ‌డుపుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు నిత్యం వివాదాల‌తోనే పొద్దు పుచ్చేవారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. ఈ పార్టీకి చెందిన 21 మంది ఎంపీల్లో(ఒక‌రు మ‌ర‌ణించారు) ఓ న‌లుగురు ఎంపీల‌పై అధిష్టానం దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. అందులోనూ ఓ యువ ఎంపీపై మ‌రింత‌గా దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఎందుకు నిఘా పెట్టాల్సి వ‌చ్చింది? ఆయ‌నెవ‌రు? చాలా ఆస‌క్తిగా మారిన ఈ విష‌యంపై వైసీపీలో అంత‌ర్గ‌తంగా జోరుగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మార్గాని భ‌ర‌త్ .. రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానం నుంచి అనూహ్య విజ‌యం ద‌క్కించుకున్న యువ నేత‌, సినీ హీరో కూడా! దైవ చింతన కూడా ఎక్కువ‌గా ఉన్న ఈ ఎంపీ.. ఏడాది తిర‌గ‌కుండానే వివాదాల కేంద్రంగా మారార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు, ఆయ‌న‌కు ఏమాత్రం ప‌డ‌డం లేద‌ని కూడా అంటున్నారు. ఇక‌, ప్ర‌చారం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఎక్క‌డ ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా.. భ‌ర‌త్ అనే నేను అనే పోస్ట‌ర్ వేసుకుంటున్నార‌ని.. ఇది పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు ఆస్కారం ఇస్తోంద‌ని చెబుతున్నారు. ఇక‌, పార్టీ అస‌మ్మ‌తి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పినా.. భ‌ర‌త్‌.. మాత్రం బ‌హిరంగంగా ఆయ‌న గురించి మాట్లాడుతున్నార‌నేది ప్ర‌ధాన వివాదం.

కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ దాడిశెట్టి రాజాతో మార్గానికి బ‌హిరంగంగానే వివాదాలు ఉన్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఇసుక రీచ్‌లు, త‌వ్వ‌కాల విష‌యం స‌హా అనేక అంశాల్లో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఇక‌, త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏదైనా జ‌రిగితే.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మేర‌కు కూడా గౌర‌వం ఇవ్వ‌డం లేద‌నేది మ‌రో కీల‌క ఆరోప‌ణ‌. ఎవ‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని, తాను సీఎం జ‌గ‌న్‌కు త‌ప్ప ఎవ‌రి మాటా వినేది కూడా లేద‌ని ఆయ‌న నేరుగా చెబుతున్న‌ట్టు స్థానిక నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిణామంతో అభివృద్ధిపై చ‌ర్చించాల‌ని అనుకున్నా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని.. అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, ఈ ప‌రిణామాల‌పై తాజాగా జ‌గ‌న్ దృష్టిపెట్టిన‌ట్టు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు వెల్ల‌డించారు. వ్య‌క్తిగా అవినీతి ర‌హితంగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌ల‌పైనే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లే మార్గానికి మైన‌స్ మార్కులు ప‌డేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

13 minutes ago

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

3 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

4 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

ఆలూ లేదు చూలూ లేదు… చిరు, నానికి లింకు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…

9 hours ago