Political News

వైసీపీలో వివాద‌మ‌వుతున్న యువ ఎంపీ

రాజ‌కీయాల్లో కొంత మంది నేత‌ల శైలి భిన్నంగా ఉంటుంది. వారు ఉన్న‌చోట వివాదాలు.. వివాదాలు ఉన్న చోట వారు ఉండ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు వివాదాల చుట్టూనే కాలం గ‌డుపుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు నిత్యం వివాదాల‌తోనే పొద్దు పుచ్చేవారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. ఈ పార్టీకి చెందిన 21 మంది ఎంపీల్లో(ఒక‌రు మ‌ర‌ణించారు) ఓ న‌లుగురు ఎంపీల‌పై అధిష్టానం దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. అందులోనూ ఓ యువ ఎంపీపై మ‌రింత‌గా దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఎందుకు నిఘా పెట్టాల్సి వ‌చ్చింది? ఆయ‌నెవ‌రు? చాలా ఆస‌క్తిగా మారిన ఈ విష‌యంపై వైసీపీలో అంత‌ర్గ‌తంగా జోరుగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మార్గాని భ‌ర‌త్ .. రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానం నుంచి అనూహ్య విజ‌యం ద‌క్కించుకున్న యువ నేత‌, సినీ హీరో కూడా! దైవ చింతన కూడా ఎక్కువ‌గా ఉన్న ఈ ఎంపీ.. ఏడాది తిర‌గ‌కుండానే వివాదాల కేంద్రంగా మారార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు, ఆయ‌న‌కు ఏమాత్రం ప‌డ‌డం లేద‌ని కూడా అంటున్నారు. ఇక‌, ప్ర‌చారం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఎక్క‌డ ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా.. భ‌ర‌త్ అనే నేను అనే పోస్ట‌ర్ వేసుకుంటున్నార‌ని.. ఇది పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు ఆస్కారం ఇస్తోంద‌ని చెబుతున్నారు. ఇక‌, పార్టీ అస‌మ్మ‌తి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పినా.. భ‌ర‌త్‌.. మాత్రం బ‌హిరంగంగా ఆయ‌న గురించి మాట్లాడుతున్నార‌నేది ప్ర‌ధాన వివాదం.

కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ దాడిశెట్టి రాజాతో మార్గానికి బ‌హిరంగంగానే వివాదాలు ఉన్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఇసుక రీచ్‌లు, త‌వ్వ‌కాల విష‌యం స‌హా అనేక అంశాల్లో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఇక‌, త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏదైనా జ‌రిగితే.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మేర‌కు కూడా గౌర‌వం ఇవ్వ‌డం లేద‌నేది మ‌రో కీల‌క ఆరోప‌ణ‌. ఎవ‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని, తాను సీఎం జ‌గ‌న్‌కు త‌ప్ప ఎవ‌రి మాటా వినేది కూడా లేద‌ని ఆయ‌న నేరుగా చెబుతున్న‌ట్టు స్థానిక నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిణామంతో అభివృద్ధిపై చ‌ర్చించాల‌ని అనుకున్నా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని.. అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, ఈ ప‌రిణామాల‌పై తాజాగా జ‌గ‌న్ దృష్టిపెట్టిన‌ట్టు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు వెల్ల‌డించారు. వ్య‌క్తిగా అవినీతి ర‌హితంగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌ల‌పైనే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లే మార్గానికి మైన‌స్ మార్కులు ప‌డేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 12, 2020 9:44 am

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

45 minutes ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

6 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

10 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

11 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

12 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

13 hours ago