Political News

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి కూడా ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. అనేక వంద‌ల స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. అనేక ల‌క్ష‌ల మంది అభిమానులు, కార్య‌క‌ర్త ల‌తోనూ అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న భేటీ అయ్యారు. అయితే.. ఎప్పుడు ఎవ‌రు కోరినా.. ఆయ‌న ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తారు. త‌న‌కు తెలియ‌నివారితోనూ న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తారు. ఇక‌, ఎవ‌రైనా ఆటోగ్రాఫ్‌(చిరు సంత‌కం) అడిగితే కాద‌న‌కుండా ఇస్తారు. అయితే.. ఇలా ఎప్పుడు ఆటో గ్రాఫ్ ఇచ్చినా.. పుస్త‌కాలు.. పేప‌ర్ల‌పై మాత్ర‌మే ఆయ‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

కానీ, తాజాగా ఓ వీరాభిమాని కోరిక‌ను సంచ‌ల‌న రీతిలో చంద్ర‌బాబు నెర‌వేర్చారు. శుక్ర‌వారం సీఎం చంద్ర‌బాబు ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఈడుపుగ‌ల్లులో ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న రెవెన్యూ స‌దస్సులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీబీఎన్ ఆర్మీ(చంద్ర‌బాబునాయుడు సైన్యం) కార్య‌క‌ర్త‌లు కూడా పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలో ఓ వీరాభిమాని, సీబీఎన్ ఆర్మీ కార్య‌క‌ర్త చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చి.. ఆటోగ్రాఫ్ అడిగారు. స‌హ‌జంగానే చంద్ర‌బాబు ఆటోగ్రాఫ్ అంటే.. ఏ పుస్త‌క‌మో.. కాయిత‌మో ఇస్తార‌ని అనుకున్నారు. వెంట‌నే పెన్ను తీశారు.

కానీ, ఆ వీరాభిమాని మాత్రం పుస్త‌కం.. కాయితం వంటివి కాకుండా.. తన గుండెల‌పైనే ఆటోగ్రాఫ్ ఇవ్వాల‌ని కోరారు. దీంతో ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయిన చంద్ర‌బాబు.. ముందు వ‌ద్ద‌న్నారు. కానీ, ఆ అభిమాని ప‌దే ప‌దే కోర‌డంతో క‌రిగిపోయారు. త‌న చేవ్రాలును అభిమాని గుండెల‌పై ఉన్న ప‌సుపు చొక్కాపై చేశారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా చ‌ప్ప‌ట్లు మార్మోగాయి. అనంత‌రం.. చంద్ర‌బాబు స‌ద‌రు అభిమాని వివ‌రాలు తెలుసుకుని.. మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని.. ఇలానే ప‌నిచేయాల‌ని సూచించారు.

This post was last modified on December 20, 2024 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago