తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా, విపక్షాలు మాత్రం కరపడుతుండటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. సభలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
స్పీకర్ ప్రసాద్ కుమార్ పరిస్థితిని సమతూలంగా నిలబెట్టేందుకు ప్రయత్నించినా, సభ్యుల ఆగ్రహం కాస్త తగ్గలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ నేతలపై వాటర్ బాటిల్స్ విసిరారని ఆరోపణలు వినిపించాయి. అలాగే, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభలో చెప్పులు చూపించాడని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సంఘటనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడారని కాంగ్రెస్ సభ్యులు క్షమాపణల కోసం ఆందోళన చేశారు. తీవ్ర గందరగోళం నెలకొన్న కారణంగా స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. సభ కొనసాగగానే ఇరువర్గాల మధ్య సద్దుమణగడానికి మరో ప్రయత్నం చేసే అవకాశం ఉందని సమాచారం. విభేదాల మధ్య ప్రభుత్వ పనితీరుపై అసెంబ్లీలో చర్చ జరగడం మరింత క్లిష్టంగా మారింది.
This post was last modified on December 20, 2024 1:37 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…