తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా, విపక్షాలు మాత్రం కరపడుతుండటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. సభలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
స్పీకర్ ప్రసాద్ కుమార్ పరిస్థితిని సమతూలంగా నిలబెట్టేందుకు ప్రయత్నించినా, సభ్యుల ఆగ్రహం కాస్త తగ్గలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ నేతలపై వాటర్ బాటిల్స్ విసిరారని ఆరోపణలు వినిపించాయి. అలాగే, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభలో చెప్పులు చూపించాడని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సంఘటనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడారని కాంగ్రెస్ సభ్యులు క్షమాపణల కోసం ఆందోళన చేశారు. తీవ్ర గందరగోళం నెలకొన్న కారణంగా స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. సభ కొనసాగగానే ఇరువర్గాల మధ్య సద్దుమణగడానికి మరో ప్రయత్నం చేసే అవకాశం ఉందని సమాచారం. విభేదాల మధ్య ప్రభుత్వ పనితీరుపై అసెంబ్లీలో చర్చ జరగడం మరింత క్లిష్టంగా మారింది.
This post was last modified on December 20, 2024 1:37 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…