ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్ ఫేక్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని సద్వినియోగం చేసేవారికన్నా దుర్వినియోగం చేసేవారే ఎక్కువ. ఇక, ఒక ఉద్దేశ్యంతో నేతలు మాట్లాడిన మాటలను తమకు అనుకూలంగా ప్రచారం చేసే ప్రత్యర్థి మీడియాల సంగతి సరేసరి. ఈ క్రమంలోనే ఏపీలోని ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు.
ఢిల్లీలో పార్లమెంటు దగ్గర పరిణామాలపై కేబినెట్ భేటీలో చర్చించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదని, కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందన్న అంశంపై చర్చ జరగాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని, మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని దిశానిర్దేశం చేశారు. గతంలో తాను వ్యవసాయం దండగ అని అనకపోయినా అన్నట్టుగా దుష్ప్రచారం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక, ఉదాసీనంగా ఉండొద్దని, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నానని అన్నారు. మంత్రుల పనితీరు, ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నామని తెలిపారు. 6 నెలల పనితీరుపై నిమ్మల రామానాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని, మిగతా వారు ఇవ్వలేదని కాస్త అసహనం వ్యక్తం చేశారు.
పేషీలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని మంత్రులకు సూచించారు.
సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపు ధోరణి వద్దని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు.
This post was last modified on December 19, 2024 10:58 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…