Political News

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్ ఫేక్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని సద్వినియోగం చేసేవారికన్నా దుర్వినియోగం చేసేవారే ఎక్కువ. ఇక, ఒక ఉద్దేశ్యంతో నేతలు మాట్లాడిన మాటలను తమకు అనుకూలంగా ప్రచారం చేసే ప్రత్యర్థి మీడియాల సంగతి సరేసరి. ఈ క్రమంలోనే ఏపీలోని ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు.

ఢిల్లీలో పార్లమెంటు దగ్గర పరిణామాలపై కేబినెట్ భేటీలో చర్చించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదని, కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందన్న అంశంపై చర్చ జరగాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని, మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని దిశానిర్దేశం చేశారు. గతంలో తాను వ్యవసాయం దండగ అని అనకపోయినా అన్నట్టుగా దుష్ప్రచారం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక, ఉదాసీనంగా ఉండొద్దని, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నానని అన్నారు. మంత్రుల పనితీరు, ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నామని తెలిపారు. 6 నెలల పనితీరుపై నిమ్మల రామానాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని, మిగతా వారు ఇవ్వలేదని కాస్త అసహనం వ్యక్తం చేశారు.

పేషీలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని మంత్రులకు సూచించారు.
సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపు ధోరణి వద్దని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు.

This post was last modified on December 19, 2024 10:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

48 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago