బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. ఆనాటి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణలు రావడంతో తాజాగా కేటీఆర్ పై కేసు నమోదైంది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు,120ఏ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్’ యాక్ట్ కింద నమోదైన ఈ కేసుల్లో 3 నాన్ బెయిలబుల్ కేసులున్నాయి.
ఈ కేసు వ్యవహారంపై గవర్నర్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం, ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేయడం, ఆనాటి బ్యాంక్ లావాదేవీల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. పెట్టుబడుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు భారీగా ఖర్చు చేసింది. త్వరలోనే కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
This post was last modified on December 19, 2024 6:11 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…