బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. ఆనాటి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణలు రావడంతో తాజాగా కేటీఆర్ పై కేసు నమోదైంది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు,120ఏ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్’ యాక్ట్ కింద నమోదైన ఈ కేసుల్లో 3 నాన్ బెయిలబుల్ కేసులున్నాయి.
ఈ కేసు వ్యవహారంపై గవర్నర్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం, ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేయడం, ఆనాటి బ్యాంక్ లావాదేవీల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. పెట్టుబడుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు భారీగా ఖర్చు చేసింది. త్వరలోనే కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
This post was last modified on December 19, 2024 6:11 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…