Political News

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు.

అయితే, ఆ సినిమాకు కేవలం 1,863 వ్యూవ్స్ మాత్రమే రావడం గమనార్హం. అంటే, ఒక్కో వ్యూవ్ కు 11 వేలు చెల్లించినట్లుగా నిలిచిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వారిపై సెటైర్ వేసేలా వ్యూహం సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈవెంట్స్ లలో వైసీపీ నేతలు అంబటి, రోజా కూడా పాల్గొన్నారు.

అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. వైసీపీ నేతలు ఫండింగ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఖజానా తెలివిగా ఖర్చు చేసినట్లు జీవీ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆరంభించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లక్షల మంది ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులు అందించినట్టు గుర్తు చేశారు.

అయితే, వైసీపీ ప్రభుత్వం పాలనలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలకు దూరమైందని, కనెక్షన్ల సంఖ్య 2019 నాటికి ఉన్న పది లక్షల నుంచి ప్రస్తుతం ఐదు లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి ఆరోపించారు. అవకతవకలతో ఫైబర్ నెట్ నష్టపోయిందని స్పష్టంచేశారు. అక్రమంగా నియమించబడిన సిబ్బందిని తొలగించడమే కాకుండా, ఖాళీల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, కొత్త ప్రణాళికలతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

This post was last modified on December 19, 2024 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago