Political News

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు.

అయితే, ఆ సినిమాకు కేవలం 1,863 వ్యూవ్స్ మాత్రమే రావడం గమనార్హం. అంటే, ఒక్కో వ్యూవ్ కు 11 వేలు చెల్లించినట్లుగా నిలిచిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వారిపై సెటైర్ వేసేలా వ్యూహం సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈవెంట్స్ లలో వైసీపీ నేతలు అంబటి, రోజా కూడా పాల్గొన్నారు.

అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. వైసీపీ నేతలు ఫండింగ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఖజానా తెలివిగా ఖర్చు చేసినట్లు జీవీ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆరంభించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లక్షల మంది ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులు అందించినట్టు గుర్తు చేశారు.

అయితే, వైసీపీ ప్రభుత్వం పాలనలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలకు దూరమైందని, కనెక్షన్ల సంఖ్య 2019 నాటికి ఉన్న పది లక్షల నుంచి ప్రస్తుతం ఐదు లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి ఆరోపించారు. అవకతవకలతో ఫైబర్ నెట్ నష్టపోయిందని స్పష్టంచేశారు. అక్రమంగా నియమించబడిన సిబ్బందిని తొలగించడమే కాకుండా, ఖాళీల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, కొత్త ప్రణాళికలతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

This post was last modified on December 19, 2024 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

44 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago