Political News

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు.

అయితే, ఆ సినిమాకు కేవలం 1,863 వ్యూవ్స్ మాత్రమే రావడం గమనార్హం. అంటే, ఒక్కో వ్యూవ్ కు 11 వేలు చెల్లించినట్లుగా నిలిచిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వారిపై సెటైర్ వేసేలా వ్యూహం సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈవెంట్స్ లలో వైసీపీ నేతలు అంబటి, రోజా కూడా పాల్గొన్నారు.

అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. వైసీపీ నేతలు ఫండింగ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఖజానా తెలివిగా ఖర్చు చేసినట్లు జీవీ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆరంభించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లక్షల మంది ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులు అందించినట్టు గుర్తు చేశారు.

అయితే, వైసీపీ ప్రభుత్వం పాలనలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలకు దూరమైందని, కనెక్షన్ల సంఖ్య 2019 నాటికి ఉన్న పది లక్షల నుంచి ప్రస్తుతం ఐదు లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి ఆరోపించారు. అవకతవకలతో ఫైబర్ నెట్ నష్టపోయిందని స్పష్టంచేశారు. అక్రమంగా నియమించబడిన సిబ్బందిని తొలగించడమే కాకుండా, ఖాళీల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, కొత్త ప్రణాళికలతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

This post was last modified on December 19, 2024 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

6 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

35 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago