Political News

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు.

అయితే, ఆ సినిమాకు కేవలం 1,863 వ్యూవ్స్ మాత్రమే రావడం గమనార్హం. అంటే, ఒక్కో వ్యూవ్ కు 11 వేలు చెల్లించినట్లుగా నిలిచిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వారిపై సెటైర్ వేసేలా వ్యూహం సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈవెంట్స్ లలో వైసీపీ నేతలు అంబటి, రోజా కూడా పాల్గొన్నారు.

అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. వైసీపీ నేతలు ఫండింగ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఖజానా తెలివిగా ఖర్చు చేసినట్లు జీవీ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆరంభించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లక్షల మంది ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులు అందించినట్టు గుర్తు చేశారు.

అయితే, వైసీపీ ప్రభుత్వం పాలనలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలకు దూరమైందని, కనెక్షన్ల సంఖ్య 2019 నాటికి ఉన్న పది లక్షల నుంచి ప్రస్తుతం ఐదు లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి ఆరోపించారు. అవకతవకలతో ఫైబర్ నెట్ నష్టపోయిందని స్పష్టంచేశారు. అక్రమంగా నియమించబడిన సిబ్బందిని తొలగించడమే కాకుండా, ఖాళీల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, కొత్త ప్రణాళికలతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

58 minutes ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

1 hour ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

2 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

2 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

2 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 hours ago