పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ పేరు పదే పదే ప్రస్తావించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందని, దాని బదులు ఏదైనా భగవంతుడి పేరు స్మరిస్తే మోక్షం లభిస్తుందని షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అంబేద్కర్ అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని షర్మిల అన్నారు. ఆ వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని ఘోరంగా అవమానించాయని షర్మిల మండిపడ్డారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీల మనోభావాలను షా దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు.
మనుస్మృతిని బీజేపీ నమ్ముతోందని, అందుకే ప్రతినిత్యం రాజ్యాంగంపై దాడికి పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంటుతోపాటు బహిరంగ సభల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను హేళన చేస్తున్నారని , షా తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంది.
This post was last modified on December 19, 2024 1:47 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…