Political News

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే గౌతు శిరీష‌ల‌తో క‌లిసి పాల్గొన్న కార్య‌క్ర‌మం రాజ‌కీయంగా మంటలు పుట్టించిన విష‌యం తెలిసిందే. దీని నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాక‌ముందే.. తాజాగా మ‌రో మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఖాళీ అవుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

“టీడీపీ త‌లుపు తెరిస్తే.. వైసీపీ ఖాళీ కావ‌డం ఖాయం” అని మంత్రి మండ‌ప‌ల్లి వ్యాఖ్యానించారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన మండ‌ప‌ల్లి.. ఎందుకులే అని చంద్ర‌బాబు వేచి చూస్తున్నార‌ని.. కానీ, ఆయ‌న ఓకే అని క‌నుసైగ చేస్తే.. మ‌రుక్ష‌ణం లోనే వైసీపీ నుంచి వ‌ల‌స‌లు గంగా ప్ర‌వాహం మాదిరిగా ఉంటాయ‌ని తెలిపారు. అప్పుడు వైసీపీలో మిగిలేది ఆ న‌లుగురు రెడ్లేన‌ని(జ‌గ‌న్ రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వి. విజ‌యసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి) చెప్పుకొచ్చారు. కానీ,తాము అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పారు.

ఇప్ప‌టికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. కానీ, వారు అన్నీ ఆలోచిస్తున్నార‌ని.. ప్ర‌జాస్వామ్య స్పూర్తిని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. కానీ, వైసీపీ బ‌రితెగించి ప్ర‌భుత్వంపై విమర్శ‌లు చేస్తోంద‌ని.. దీంతో వారు క‌నుక క‌నుసైగ చేస్తే.. త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమ‌ని మండ‌ప‌ల్లి చెప్పుకొచ్చారు. ఒకవేళ దేశంలో జ‌మిలి ఎన్నికలు వ‌చ్చినా.. త్వరలోనే ఎన్నిక‌లు జరిగినా వైసీపీ నుంచి పోటీ చేసే వారే ఉండరని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

This post was last modified on December 18, 2024 10:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago