వైసీపీ అధినేత జగన్ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 4 వేల కోట్ల రూపాయలను నష్టపరిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.
విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలనను దుయ్యబట్టారు. కనీసం సామాన్యులకు చుక్క నీరు అందించాలన్న స్పృహ కూడా గత ప్రభు త్వానికి లేకుండా పోయిందన్నారు. ప్రాణాధారమైన నీటిని అందించడంలోనూ శ్రద్ధ చూపలేదన్నారు. తాను చేసిన వారాహి యాత్రల్లో అనేక మంది మహిళలు బిందెలు పట్టుకుని వచ్చారని.. తమకు తాగు నీరు కూడా ఇవ్వడం లేదని అప్పట్లో తనకు చెప్పారని అన్నారు.
మహిళల నీటి కష్టాలు చూసి తన మనసు కరిగిపోయిందని పవన్ కల్యాణ్చెప్పారు. అందుకే తాను జల జీవన్ మిషన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వివరించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే వరకు తన మనసు కుదుట పడదని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యతగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి వ్యక్తికీ వ్యతిగత అవసరాల కోసం రోజుకు 55 లీటర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జల జీవన్ మిషన్పైనే ఎక్కువగా చర్చించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్లను కేటాయించిందన్నారు.
This post was last modified on December 18, 2024 1:59 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…