వైసీపీ అధినేత జగన్ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 4 వేల కోట్ల రూపాయలను నష్టపరిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.
విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలనను దుయ్యబట్టారు. కనీసం సామాన్యులకు చుక్క నీరు అందించాలన్న స్పృహ కూడా గత ప్రభు త్వానికి లేకుండా పోయిందన్నారు. ప్రాణాధారమైన నీటిని అందించడంలోనూ శ్రద్ధ చూపలేదన్నారు. తాను చేసిన వారాహి యాత్రల్లో అనేక మంది మహిళలు బిందెలు పట్టుకుని వచ్చారని.. తమకు తాగు నీరు కూడా ఇవ్వడం లేదని అప్పట్లో తనకు చెప్పారని అన్నారు.
మహిళల నీటి కష్టాలు చూసి తన మనసు కరిగిపోయిందని పవన్ కల్యాణ్చెప్పారు. అందుకే తాను జల జీవన్ మిషన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వివరించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే వరకు తన మనసు కుదుట పడదని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యతగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి వ్యక్తికీ వ్యతిగత అవసరాల కోసం రోజుకు 55 లీటర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జల జీవన్ మిషన్పైనే ఎక్కువగా చర్చించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్లను కేటాయించిందన్నారు.
This post was last modified on December 18, 2024 1:59 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…