Political News

జ‌గ‌న్ పాల‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌ప‌రిచార‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నార‌ని తెలిపారు. ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కం కింద‌.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింద‌ని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేసింద‌న్నారు.

విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వ‌హించిన‌ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ పాల‌న‌ను దుయ్య‌బ‌ట్టారు. క‌నీసం సామాన్యుల‌కు చుక్క నీరు అందించాల‌న్న స్పృహ కూడా గ‌త ప్ర‌భు త్వానికి లేకుండా పోయింద‌న్నారు. ప్రాణాధార‌మైన నీటిని అందించ‌డంలోనూ శ్ర‌ద్ధ చూప‌లేద‌న్నారు. తాను చేసిన వారాహి యాత్ర‌ల్లో అనేక మంది మ‌హిళ‌లు బిందెలు ప‌ట్టుకుని వ‌చ్చార‌ని.. త‌మ‌కు తాగు నీరు కూడా ఇవ్వ‌డం లేద‌ని అప్ప‌ట్లో త‌న‌కు చెప్పార‌ని అన్నారు.

మ‌హిళ‌ల నీటి క‌ష్టాలు చూసి త‌న మ‌న‌సు క‌రిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌చెప్పారు. అందుకే తాను జ‌ల జీవ‌న్ మిష‌న్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాన‌ని వివ‌రించారు. ప్ర‌తి ఇంటికీ స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించే వ‌ర‌కు త‌న మ‌న‌సు కుదుట ప‌డ‌ద‌ని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది ప‌డుతున్న ఇబ్బందుల‌ను పరిష్క‌రించ‌డ‌మే త‌న తొలి ప్రాధాన్యతగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామ‌న్నారు.

ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ప్ర‌తి వ్య‌క్తికీ వ్య‌తిగ‌త అవ‌స‌రాల కోసం రోజుకు 55 లీట‌ర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు కూడా జ‌ల జీవ‌న్ మిష‌న్‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్ల‌ను కేటాయించింద‌న్నారు.

This post was last modified on December 18, 2024 1:59 pm

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

2 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

2 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

4 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

5 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

5 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

5 hours ago