Political News

జ‌గ‌న్ పాల‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌ప‌రిచార‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నార‌ని తెలిపారు. ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కం కింద‌.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింద‌ని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేసింద‌న్నారు.

విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వ‌హించిన‌ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ పాల‌న‌ను దుయ్య‌బ‌ట్టారు. క‌నీసం సామాన్యుల‌కు చుక్క నీరు అందించాల‌న్న స్పృహ కూడా గ‌త ప్ర‌భు త్వానికి లేకుండా పోయింద‌న్నారు. ప్రాణాధార‌మైన నీటిని అందించ‌డంలోనూ శ్ర‌ద్ధ చూప‌లేద‌న్నారు. తాను చేసిన వారాహి యాత్ర‌ల్లో అనేక మంది మ‌హిళ‌లు బిందెలు ప‌ట్టుకుని వ‌చ్చార‌ని.. త‌మ‌కు తాగు నీరు కూడా ఇవ్వ‌డం లేద‌ని అప్ప‌ట్లో త‌న‌కు చెప్పార‌ని అన్నారు.

మ‌హిళ‌ల నీటి క‌ష్టాలు చూసి త‌న మ‌న‌సు క‌రిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌చెప్పారు. అందుకే తాను జ‌ల జీవ‌న్ మిష‌న్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాన‌ని వివ‌రించారు. ప్ర‌తి ఇంటికీ స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించే వ‌ర‌కు త‌న మ‌న‌సు కుదుట ప‌డ‌ద‌ని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది ప‌డుతున్న ఇబ్బందుల‌ను పరిష్క‌రించ‌డ‌మే త‌న తొలి ప్రాధాన్యతగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామ‌న్నారు.

ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ప్ర‌తి వ్య‌క్తికీ వ్య‌తిగ‌త అవ‌స‌రాల కోసం రోజుకు 55 లీట‌ర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు కూడా జ‌ల జీవ‌న్ మిష‌న్‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్ల‌ను కేటాయించింద‌న్నారు.

This post was last modified on December 18, 2024 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

17 minutes ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

1 hour ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

3 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

3 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

4 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

5 hours ago