వైసీపీ అధినేత జగన్ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 4 వేల కోట్ల రూపాయలను నష్టపరిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.
విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలనను దుయ్యబట్టారు. కనీసం సామాన్యులకు చుక్క నీరు అందించాలన్న స్పృహ కూడా గత ప్రభు త్వానికి లేకుండా పోయిందన్నారు. ప్రాణాధారమైన నీటిని అందించడంలోనూ శ్రద్ధ చూపలేదన్నారు. తాను చేసిన వారాహి యాత్రల్లో అనేక మంది మహిళలు బిందెలు పట్టుకుని వచ్చారని.. తమకు తాగు నీరు కూడా ఇవ్వడం లేదని అప్పట్లో తనకు చెప్పారని అన్నారు.
మహిళల నీటి కష్టాలు చూసి తన మనసు కరిగిపోయిందని పవన్ కల్యాణ్చెప్పారు. అందుకే తాను జల జీవన్ మిషన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వివరించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే వరకు తన మనసు కుదుట పడదని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యతగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి వ్యక్తికీ వ్యతిగత అవసరాల కోసం రోజుకు 55 లీటర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జల జీవన్ మిషన్పైనే ఎక్కువగా చర్చించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్లను కేటాయించిందన్నారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…