Political News

జ‌గ‌న్ పాల‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌ప‌రిచార‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నార‌ని తెలిపారు. ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కం కింద‌.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింద‌ని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేసింద‌న్నారు.

విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వ‌హించిన‌ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ పాల‌న‌ను దుయ్య‌బ‌ట్టారు. క‌నీసం సామాన్యుల‌కు చుక్క నీరు అందించాల‌న్న స్పృహ కూడా గ‌త ప్ర‌భు త్వానికి లేకుండా పోయింద‌న్నారు. ప్రాణాధార‌మైన నీటిని అందించ‌డంలోనూ శ్ర‌ద్ధ చూప‌లేద‌న్నారు. తాను చేసిన వారాహి యాత్ర‌ల్లో అనేక మంది మ‌హిళ‌లు బిందెలు ప‌ట్టుకుని వ‌చ్చార‌ని.. త‌మ‌కు తాగు నీరు కూడా ఇవ్వ‌డం లేద‌ని అప్ప‌ట్లో త‌న‌కు చెప్పార‌ని అన్నారు.

మ‌హిళ‌ల నీటి క‌ష్టాలు చూసి త‌న మ‌న‌సు క‌రిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌చెప్పారు. అందుకే తాను జ‌ల జీవ‌న్ మిష‌న్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాన‌ని వివ‌రించారు. ప్ర‌తి ఇంటికీ స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించే వ‌ర‌కు త‌న మ‌న‌సు కుదుట ప‌డ‌ద‌ని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది ప‌డుతున్న ఇబ్బందుల‌ను పరిష్క‌రించ‌డ‌మే త‌న తొలి ప్రాధాన్యతగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామ‌న్నారు.

ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ప్ర‌తి వ్య‌క్తికీ వ్య‌తిగ‌త అవ‌స‌రాల కోసం రోజుకు 55 లీట‌ర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు కూడా జ‌ల జీవ‌న్ మిష‌న్‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్ల‌ను కేటాయించింద‌న్నారు.

Satya

Recent Posts

న‌ట‌రాజ‌న్‌… కింక‌ర్త‌వ్యం…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…

31 minutes ago

పూజా హెగ్డేకు మరోసారి నిరాశ

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…

1 hour ago

లెజెండరీ దర్శకులు భారతీరాజా ఇక లేరు

ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…

3 hours ago

గంట వాన పడితే ఇదీ హైదరాబాద్ పరిస్తితి

వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…

4 hours ago

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

13 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

13 hours ago