Political News

జ‌వ‌హ‌ర్ మీటింగ్‌.. అంద‌రూ డుమ్మానే!

రాజ‌కీయాల్లో ఎక్క‌డ ఎలాంటి పాచిక వేస్తే పారుతుందో తెలియ‌ని నాయ‌కులు ఉండ‌రు. పైగా ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే చంద్ర‌బాబుకు కొత్త‌గా రాజ‌కీయ పాఠాలు ఎవ‌రూ నేర్పాల్సిన అవ‌స‌రం లేదు. అయినా ఆయ‌న వేసే అడుగులు కొన్ని రాంగ్ ప‌డ్డాయ‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఏదో ఊహించేసుకుని.. సీనియర్లు చెప్పినా కూడా మాట విన‌కుండా కొంద‌రికి టికెట్‌లు ఇచ్చారు. వారంతా ఓడిపోయారు. ఇప్పుడు పార్ల‌మెంట‌రీ జిల్లా ప‌గ్గాల విష‌యంలోనూ ఇలాంటి త‌ప్పులే దొర్లాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇలాంటి వాటిలో ముందున్న నియోజ‌క‌వ‌ర్గం రాజ‌మండ్రి.

రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ జిల్లా ప‌గ్గాల‌ను మాజీ మంత్రి ఎస్సీ నాయ‌కుడు కొత్త‌ప‌ల్లి శ్యామ్యూల్ జ‌వ‌హ‌ర్‌కు అప్ప‌గించారు చంద్ర‌బాబు. కానీ, ఇక్క‌డ ఆయ‌న విఫ‌ల‌మైన నాయ‌కుడిగా స్థానిక నేత‌లు ఇప్ప‌టికీ చ‌ర్చించుకుంటున్నారు. రెండు జిల్లాల్లో విస్త‌రించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం అంటే.. మాట‌లు కాదు. అయినా.. జవ‌హ‌ర్ భుజాన వేసుకున్నారు. ఈయ‌న‌క‌న్నా సీనియ‌ర్లు.. అటు తూర్పుగోదావ‌రిలోను, ఇటు ప‌శ్చిమ గోదావ‌రిలోను ఉన్నారు. దీంతో వీరు ఇప్పుడు జ‌వ‌హ‌ర్ రాజ‌కీయాలంటే.. మండిప‌డుతున్నారు. పైగా ఆయ‌న వ‌ద్ద‌ని, మార్చాల‌ని గ‌ళం వినిపించిన నాయ‌కులే ఇప్పుడు ఆయ‌న‌కు జై కొట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ ప‌రిణామాలతో ఇక్క‌డి నాయ‌కులు ఉడికి పోతున్నారు. స‌రే.. ఇదిలావుంటే, తాజాగా జ‌వ‌హ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇల్లే వేదిక‌గా ఈ స‌మావేశం నిర్వ‌హించారు. మ‌రి జ‌వ‌హ‌ర్ ఇచ్చిన పిలుపుతో ఎంత‌మంది నాయ‌కులు ఈ స‌మావేశానికి వ‌చ్చారు? ఎవ‌రెవ‌రు ఆయ‌న‌తో క‌లిసి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు? అంటే.. వేళ్ల మీద లెక్కించుకునే రేంజ్‌లోనేసాగింది. దాదాపు అర‌గంట‌కు పైగా నాయ‌కుల రాక‌కోసం.. జ‌వ‌హ‌ర్ ఎదురు చూశారు. అయిన‌ప్ప‌టికీ కీల‌కమైన నాయ‌కులు ఎవ‌రూ రాలేదు. దీంతో కార్య‌క్రమాన్ని మ‌మ అనిపించి త‌ప్పుకొన్నారు జ‌వ‌హ‌ర్‌.

ఈ స‌మ‌వేశం త‌ర్వాత జ‌వ‌హ‌ర్ నిరుత్త‌రుల‌య్యారనే వాద‌న వెలుగు చూసింది. అటు రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీ కానీ.. ఇటు రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య కానీ.. జ‌వ‌హ‌ర్ స‌మావేశానికి రాలేదు. పైగా వారు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. దీంతో మున్ముందు తాను ఇక్క‌డ నెగ్గుకురాగ‌ల‌నా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింద‌ట‌. మొత్తంగా చూస్తే.. జ‌వ‌హ‌ర్ మీటింగ్ అయితే పెట్టారు కానీ. నేత‌ల‌ను మాత్రం క‌దిలంచ‌లేక పోయార‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న వాద‌న‌. మ‌రి ఏం చేస్తారో.. ఎలా ముందుకు వెళ్తారో చూడాలి అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

18 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

53 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

4 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

4 hours ago