Political News

బీఆర్ఎస్ చేసింది.. కాంగ్రెస్‌ చేయ‌క‌పోతే రోడ్డెక్కుతాం: ఒవైసీ

తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు వ్య‌వ‌హారం కాక రేపింది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో విద్యార్థుల‌కు చెల్లించాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంటును ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించ‌డం లేద‌ని ఎంఐఎం స‌భ్యుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ నిల‌దీశారు. విద్యార్థుల‌పై రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ అప్ప‌టి ప్ర‌భుత్వం బ‌కాయిలు పెట్టింద‌ని తెలిపారు. వేల‌ కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు ఉన్నాయ‌ని చెప్పారు.

అయితే.. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉమ్మ‌డి రాష్ట్రంలో పెట్టిన బ‌కాయిల‌ను చెల్లించార‌ని అక్బ‌రుద్దీన్ తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా కొన్ని బ‌కాయిలు పెట్టింద‌ని.. వీటిని చెల్లించాల్సిన బాధ్య‌త ప్ర‌జా ప్ర‌భుత్వంగా కాంగ్రెస్‌పై ఉంద‌న్నారు. త‌క్ష‌ణ‌మే ఫీజు రీయింబ‌ర్స్ మెంటు బ‌కాయిలు చెల్లించాలని అక్బ‌రుద్దీన్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు విడుద‌ల చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌న్నారు.

తానే స్వ‌య‌గా రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెలుపుతాన‌ని చెప్పారు. ప్ర‌జ‌లకు సుప‌రిపాల‌న‌ను అందిస్తాన‌ని చెబుతున్న ముఖ్య‌మంత్రి, మంత్రులు.. విద్యార్థుల ఫీజులు ఎగ్గొట్టి రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇది స‌రైన విధానం కాద‌న్నారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. విద్యార్థుల‌కు రాజకీయాలు అంట‌గ‌ట్ట‌డం స‌రికాద‌ని హెచ్చ‌రించారు. దీనిపై తాము ఉద్య‌మాల‌కు రెడీ అవుతున్న‌ట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల‌తో క‌లిసి నిర‌స‌న తెలుపుతామ‌ని పేర్కొన్నారు.

This post was last modified on December 17, 2024 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago