తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటు వ్యవహారం కాక రేపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంటును ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించడం లేదని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిలదీశారు. విద్యార్థులపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ అప్పటి ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తెలిపారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పారు.
అయితే.. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన బకాయిలను చెల్లించారని అక్బరుద్దీన్ తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని బకాయిలు పెట్టిందని.. వీటిని చెల్లించాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్పై ఉందన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు చెల్లించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
తానే స్వయగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతానని చెప్పారు. ప్రజలకు సుపరిపాలనను అందిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు.. విద్యార్థుల ఫీజులు ఎగ్గొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదన్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని హెచ్చరించారు. దీనిపై తాము ఉద్యమాలకు రెడీ అవుతున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.
This post was last modified on December 17, 2024 2:22 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…