Political News

బీఆర్ఎస్ చేసింది.. కాంగ్రెస్‌ చేయ‌క‌పోతే రోడ్డెక్కుతాం: ఒవైసీ

తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు వ్య‌వ‌హారం కాక రేపింది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో విద్యార్థుల‌కు చెల్లించాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంటును ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించ‌డం లేద‌ని ఎంఐఎం స‌భ్యుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ నిల‌దీశారు. విద్యార్థుల‌పై రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ అప్ప‌టి ప్ర‌భుత్వం బ‌కాయిలు పెట్టింద‌ని తెలిపారు. వేల‌ కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు ఉన్నాయ‌ని చెప్పారు.

అయితే.. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉమ్మ‌డి రాష్ట్రంలో పెట్టిన బ‌కాయిల‌ను చెల్లించార‌ని అక్బ‌రుద్దీన్ తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా కొన్ని బ‌కాయిలు పెట్టింద‌ని.. వీటిని చెల్లించాల్సిన బాధ్య‌త ప్ర‌జా ప్ర‌భుత్వంగా కాంగ్రెస్‌పై ఉంద‌న్నారు. త‌క్ష‌ణ‌మే ఫీజు రీయింబ‌ర్స్ మెంటు బ‌కాయిలు చెల్లించాలని అక్బ‌రుద్దీన్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు విడుద‌ల చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌న్నారు.

తానే స్వ‌య‌గా రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెలుపుతాన‌ని చెప్పారు. ప్ర‌జ‌లకు సుప‌రిపాల‌న‌ను అందిస్తాన‌ని చెబుతున్న ముఖ్య‌మంత్రి, మంత్రులు.. విద్యార్థుల ఫీజులు ఎగ్గొట్టి రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇది స‌రైన విధానం కాద‌న్నారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. విద్యార్థుల‌కు రాజకీయాలు అంట‌గ‌ట్ట‌డం స‌రికాద‌ని హెచ్చ‌రించారు. దీనిపై తాము ఉద్య‌మాల‌కు రెడీ అవుతున్న‌ట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల‌తో క‌లిసి నిర‌స‌న తెలుపుతామ‌ని పేర్కొన్నారు.

This post was last modified on December 17, 2024 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

31 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

50 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago