ఒకే దేశం-ఒకే ఎన్నికల బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 129వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును సభలో ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. దేశంలో ఒకే సారి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖజానాపై భారం తగ్గుతుందని.. అదేవిధంగా పాలనా వ్యవస్థల పనితీరు కూడా మెరుగు పడుతుందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి, తెలుగు దేశం పార్టీ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. జాతి నిర్మాణానికి ఈ బిల్లు దోహద పడుతుందని చెప్పారు. కాగా.. ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు ఇచ్చినట్టేనని తెలిపారు.
అధికార పక్షానికి సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు లేనప్పుడు ఈ బిల్లును ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిం ది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తృణమూల్ సభ్యులు వ్యతిరేకించడం గమనార్హం. అయితే.. ఎన్డీయే కూటమిలోని జేడీయూ, జేడీఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు. ఇక, బీజేపీ సభ్యులు మాత్రం ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు.
ప్రతి బిల్లును అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. దీనిపై చర్చ సాగుతుందని.. జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని బీజేపీ సభ్యులు తెలిపారు. అయితే.. అసలు సభలో అధికార పక్షానికి బలం లేనప్పుడు.. ఈ బిల్లును తీసుకురావడంలో ఔచిత్యం ఏంటని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. మొత్తంగా లోక్సభలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.
This post was last modified on December 17, 2024 2:03 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…