వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో చాలా రోజులుగా అనేక రకాల అభిప్రాయాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జమిలి పద్ధతికి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనుకున్న టైమ్ లో మరో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. డిసెంబర్ 16న లోక్సభలో వీటిని ప్రవేశపెడతారని కేబినెట్ స్థాయిలో నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో బిజినెస్ లిస్టులో ఈ బిల్లులు కనిపించకపోవడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నిర్ణయంతో బిల్లుల పరిణామంపై కొత్త సందిగ్ధత నెలకొంది.
గత వారం రోజులుగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుల చర్చ తీవ్రతరంగా సాగింది. ఈ బిల్లుల ప్రతులను ఎంపీలకు పంపిణీ చేసిన కేంద్రం, పార్లమెంటులో వీటిపై చర్చను ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే, లీడర్ ఆఫ్ ది హౌస్తో పాటు ప్రతిపక్షాల నుంచి వచ్చిన వ్యతిరేకతలు, బిల్లుల అంశాలపై విస్తృత చర్చ అవసరమని కొందరు అభిప్రాయపడటంతో కేంద్రం తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ఇప్పటికే బిల్లులపై వైవిధ్యమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఎన్నికల వ్యవస్థలో సమర్ధతను పెంచాలని భావించినా, దీనికి అవసరమైన అమలు విధానాలపై చాలా సందిగ్ధత ఉంది. ఈ బిల్లుల అనుసరణ వల్ల ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయనే ఆరోపణలు ప్రధాన ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మరిన్ని మార్పులు, చర్చల తర్వాతే బిల్లులను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిసెంబర్ 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమయానికి బిల్లుల చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. మరి ఈ బిల్లులు మరోసారి ముందుకు వచ్చేనా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆచరణ సాధ్యమయ్యే స్థాయికి ఈ ప్రతిపాదనలు చేరేవరకు కేంద్రం వేచి చూడాల్సిందే.
This post was last modified on December 15, 2024 9:28 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…