జమిలి ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. దాదాపుగా ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. ఈ క్రమంలోనే 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జమిలి బిల్లు ఆమోదం పొందినా 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
“వన్ నేషన్-వన్ ఎలక్షన్” కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. అయితే, జమిలిపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవటానికి 2027లోనే ఎన్నికలు అని చెబుతున్నారని విమర్శించారు. కానీ, వైసీపీ నేతల మాటలపై ప్రజలు విశ్వనీయత కోల్పోయి చాలాకాలం అయిందని చెప్పారు. వైసీపీ నేతల డ్రామాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీలు మొదలు స్కూళ్ల వరకు అంతటా దీనిపై చర్చ జరగాలని చెప్పారు. విజన్ 2020 ఏ విధంగా సాకారమైందన్న విషయాన్ని ఈ తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటికి 2020 నాటికి పరిస్థితులలో తేడాను ఈ తరం గుర్తించాలని చెప్పారు. విజన్-2020 మాదిరే విజన్- 2047 కూడా సక్సెస్ అవుతుందని అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నం అని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు – సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే మీటింగ్ ఎజెండా చెబుతామని, వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు.
This post was last modified on December 14, 2024 1:25 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…