Political News

2027 కాదు 2029లోనే జమిలి: చంద్రబాబు

జమిలి ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. దాదాపుగా ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. ఈ క్రమంలోనే 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జమిలి బిల్లు ఆమోదం పొందినా 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

“వన్ నేషన్-వన్ ఎలక్షన్” కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. అయితే, జమిలిపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవటానికి 2027లోనే ఎన్నికలు అని చెబుతున్నారని విమర్శించారు. కానీ, వైసీపీ నేతల మాటలపై ప్రజలు విశ్వనీయత కోల్పోయి చాలాకాలం అయిందని చెప్పారు. వైసీపీ నేతల డ్రామాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

యూనివర్సిటీలు మొదలు స్కూళ్ల వరకు అంతటా దీనిపై చర్చ జరగాలని చెప్పారు. విజన్ 2020 ఏ విధంగా సాకారమైందన్న విషయాన్ని ఈ తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటికి 2020 నాటికి పరిస్థితులలో తేడాను ఈ తరం గుర్తించాలని చెప్పారు. విజన్-2020 మాదిరే విజన్- 2047 కూడా సక్సెస్ అవుతుందని అన్నారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నం అని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు – సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే మీటింగ్ ఎజెండా చెబుతామని, వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు.

This post was last modified on December 14, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

55 minutes ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

6 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

9 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

9 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

10 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

10 hours ago