Political News

2027 కాదు 2029లోనే జమిలి: చంద్రబాబు

జమిలి ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. దాదాపుగా ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. ఈ క్రమంలోనే 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జమిలి బిల్లు ఆమోదం పొందినా 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

“వన్ నేషన్-వన్ ఎలక్షన్” కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. అయితే, జమిలిపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవటానికి 2027లోనే ఎన్నికలు అని చెబుతున్నారని విమర్శించారు. కానీ, వైసీపీ నేతల మాటలపై ప్రజలు విశ్వనీయత కోల్పోయి చాలాకాలం అయిందని చెప్పారు. వైసీపీ నేతల డ్రామాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

యూనివర్సిటీలు మొదలు స్కూళ్ల వరకు అంతటా దీనిపై చర్చ జరగాలని చెప్పారు. విజన్ 2020 ఏ విధంగా సాకారమైందన్న విషయాన్ని ఈ తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటికి 2020 నాటికి పరిస్థితులలో తేడాను ఈ తరం గుర్తించాలని చెప్పారు. విజన్-2020 మాదిరే విజన్- 2047 కూడా సక్సెస్ అవుతుందని అన్నారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నం అని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు – సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే మీటింగ్ ఎజెండా చెబుతామని, వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు.

This post was last modified on December 14, 2024 1:25 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago