జమిలి ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. దాదాపుగా ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. ఈ క్రమంలోనే 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జమిలి బిల్లు ఆమోదం పొందినా 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
“వన్ నేషన్-వన్ ఎలక్షన్” కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. అయితే, జమిలిపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవటానికి 2027లోనే ఎన్నికలు అని చెబుతున్నారని విమర్శించారు. కానీ, వైసీపీ నేతల మాటలపై ప్రజలు విశ్వనీయత కోల్పోయి చాలాకాలం అయిందని చెప్పారు. వైసీపీ నేతల డ్రామాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీలు మొదలు స్కూళ్ల వరకు అంతటా దీనిపై చర్చ జరగాలని చెప్పారు. విజన్ 2020 ఏ విధంగా సాకారమైందన్న విషయాన్ని ఈ తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటికి 2020 నాటికి పరిస్థితులలో తేడాను ఈ తరం గుర్తించాలని చెప్పారు. విజన్-2020 మాదిరే విజన్- 2047 కూడా సక్సెస్ అవుతుందని అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నం అని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు – సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే మీటింగ్ ఎజెండా చెబుతామని, వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…