Political News

కలకలం… హెరిటేజ్ సెక్యూరిటీ గార్డ్ కు కరోనా

ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా… టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని కంపెనీకి సోకేసింది. హెరిటేజ్ పేరిట పాలు, పాల పదార్థాల తయారీ కంపెనీ చంద్రబాబు ఫ్యామిలీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో యూనిట్లు ఉన్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ యూనిట్ లో మంగళవారం కరోనా కలకలం రేగింది. ఈ యూనిట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు యువకుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా గాంధీ ఆసుపత్రికి తరించేశారు.

హెరిటేజ్ ప్లాంట్ కు చెందిన ఉద్యోగికి కరోనా పాజిటివ్ అన్న విషయం బయటకు రాగానే… అటు ఉప్పల్ స్థానికులతో పాటు హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే… కరోనా పాజిటివ్ గా తేలిన సెక్యూరిటీ గార్డును ఆసుపత్రికి తరలించిన అధికారులు… ప్లాంట్ లో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా పరీక్షలు చేయగా.. వారిలో ఓ ఏడుగురు కరోనా అనుమానితులుగా తేలారట. దీంతో వారి చేతులపై హోం క్వారంటైన్ అనే ముద్ర వేసిన అధికారులు వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారట.

అయితే హోం క్వారంటైన్ కు పంపిన వారిని కూడా విధులకు హాజరు కావాలని హెటిరేజ్ యాజమాన్యం ఒత్తిడి తీసుకువచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కరోనా అనుమానితులు విధులకు హాజరైతే మిగిలిన ఉద్యోగుల పరిస్థితి, ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఉప్పల్ వాసులు హెరిటేజ్ ఎదుట ఆందోళనకు దిగారట. దీంతో ఉప్పల్ లోని హెరిటేజ్ ప్లాంట్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా… స్థానికులు శాంతించలేదట. మొత్తంగా కరోనా వేళ… హెరిటేజ్ కంపెనీలోనూ కలకలం రేగిందని చెప్పక తప్పదు.

suman

Recent Posts

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

49 minutes ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

53 minutes ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

3 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

5 hours ago