Political News

బీహార్ లో ఆర్జేడీకి ఊహించని దెబ్బ

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆర్జేడీకి ఊహించని దెబ్బ పడింది. బీహార్ మాజీ, ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు లాలూ ప్రసాదయాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకావాలు లేవని తేలిపోయింది. పశుదాణా కేసులో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తారని అందరు అనుకున్నారు. ఆర్జేడీకి ప్రస్తుత ఎన్నికల్లో గెలవటం చాలా అవసరం. లాలూ తరపున ఆయన కొడుకు తేజస్వీ యాదవే అన్నీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో ఈ పార్టీ 143 సీట్లలో పోటి చేస్తోంది. మరో 70 సీట్లకు కాంగ్రెస్ పోటి చేస్తుంటే మిగిలిన సీట్లలో చిన్నా చితకా భాగస్వామ్య పార్టీలు పోటి చేస్తున్నాయి.

విషయం ఏమిటంటే ఈ ఎన్నికలు ఇటు ఎన్డీఏ కూటమికి అటు యూపీఏ కూటమికి రెండింటికి చాలా కీలకమే. రెండు కూటముల్లోను మైనసులున్నాయి, ప్లస్సులున్నాయి. కాకపోతే ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా పాల్గొంటారు. ఎన్నికల వ్యూహాలను అమిత్ తెర వెనుక నుండి నడిపిస్తారు. ఇదే సమయంలో యూపీఏ కూటమి తరపున ప్రచారానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి వస్తారో లేదో తెలీదు. ఇదే సమయంలో రాహూల్ గాంధి, ప్రియాంకా గాంధి రావటం ఖాయమైంది. సరే మోడి, అమిత్ , రాహూల్, ప్రియాంకా ఇలా ఎంతమంది వచ్చిన అందరు బయటవాళ్ళే అన్నది మరచిపోకూడదు.

కానీ లోకల్ అనే ట్యాగ్ ఉన్న వాళ్ళల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలు మాత్రం కొద్ది మందే ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఇంపార్టెంట్. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లాలూ బెయిల్ పై బయటకు వచ్చేయటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొని చక్రం తిప్పటం ఖాయమనే అందరు అనుకున్నారు. దానికి తగ్గట్లే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది లాలూ వచ్చేయటం ఖాయమే అనుకుంటున్న సమయంలో ఊహించని రితిలో బ్రేకులు పడ్డాయి. ట్రెజరిని మోసం చేసి రూ. 3.3 కోట్లను కాజేసిన కేసు కూడా లాలూపై మరో కేసుంది. ఈ కేసులో కూడా శిక్షపడింది.

అంటే రెండు కేసుల్లో పడిన శిక్షల్లో ఒకదానికి బెయిల్ వచ్చినా మరో కేసు శిక్ష విషయంలో లాలూకు బెయిల్ దొరకలేదు. ఎన్నికల్లోపు బెయిల్ దొరికే అవకాశం కూడా లేదని సమాచారం. ఈ పరిణామాన్ని ఆర్జేడీ ఏమాత్రం ఊహించలేదు. గడచిన 40 ఏళ్ళల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి లాలూ దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఆ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా లాలూ ప్రచారం చేయలేదు. ఇక లాలూ బయటకు వచ్చే అవకాశం లేదని తేలిపోవటంతో ప్రత్యామ్నాయంగా ప్రచార బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. బహుశా లాలూ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని రంగంలోకి దింపుతారేమో చూడాలి.

This post was last modified on October 10, 2020 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

5 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

8 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

10 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

11 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

11 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

12 hours ago