Political News

బీహార్ లో ఆర్జేడీకి ఊహించని దెబ్బ

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆర్జేడీకి ఊహించని దెబ్బ పడింది. బీహార్ మాజీ, ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు లాలూ ప్రసాదయాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకావాలు లేవని తేలిపోయింది. పశుదాణా కేసులో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తారని అందరు అనుకున్నారు. ఆర్జేడీకి ప్రస్తుత ఎన్నికల్లో గెలవటం చాలా అవసరం. లాలూ తరపున ఆయన కొడుకు తేజస్వీ యాదవే అన్నీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో ఈ పార్టీ 143 సీట్లలో పోటి చేస్తోంది. మరో 70 సీట్లకు కాంగ్రెస్ పోటి చేస్తుంటే మిగిలిన సీట్లలో చిన్నా చితకా భాగస్వామ్య పార్టీలు పోటి చేస్తున్నాయి.

విషయం ఏమిటంటే ఈ ఎన్నికలు ఇటు ఎన్డీఏ కూటమికి అటు యూపీఏ కూటమికి రెండింటికి చాలా కీలకమే. రెండు కూటముల్లోను మైనసులున్నాయి, ప్లస్సులున్నాయి. కాకపోతే ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా పాల్గొంటారు. ఎన్నికల వ్యూహాలను అమిత్ తెర వెనుక నుండి నడిపిస్తారు. ఇదే సమయంలో యూపీఏ కూటమి తరపున ప్రచారానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి వస్తారో లేదో తెలీదు. ఇదే సమయంలో రాహూల్ గాంధి, ప్రియాంకా గాంధి రావటం ఖాయమైంది. సరే మోడి, అమిత్ , రాహూల్, ప్రియాంకా ఇలా ఎంతమంది వచ్చిన అందరు బయటవాళ్ళే అన్నది మరచిపోకూడదు.

కానీ లోకల్ అనే ట్యాగ్ ఉన్న వాళ్ళల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలు మాత్రం కొద్ది మందే ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఇంపార్టెంట్. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లాలూ బెయిల్ పై బయటకు వచ్చేయటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొని చక్రం తిప్పటం ఖాయమనే అందరు అనుకున్నారు. దానికి తగ్గట్లే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది లాలూ వచ్చేయటం ఖాయమే అనుకుంటున్న సమయంలో ఊహించని రితిలో బ్రేకులు పడ్డాయి. ట్రెజరిని మోసం చేసి రూ. 3.3 కోట్లను కాజేసిన కేసు కూడా లాలూపై మరో కేసుంది. ఈ కేసులో కూడా శిక్షపడింది.

అంటే రెండు కేసుల్లో పడిన శిక్షల్లో ఒకదానికి బెయిల్ వచ్చినా మరో కేసు శిక్ష విషయంలో లాలూకు బెయిల్ దొరకలేదు. ఎన్నికల్లోపు బెయిల్ దొరికే అవకాశం కూడా లేదని సమాచారం. ఈ పరిణామాన్ని ఆర్జేడీ ఏమాత్రం ఊహించలేదు. గడచిన 40 ఏళ్ళల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి లాలూ దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఆ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా లాలూ ప్రచారం చేయలేదు. ఇక లాలూ బయటకు వచ్చే అవకాశం లేదని తేలిపోవటంతో ప్రత్యామ్నాయంగా ప్రచార బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. బహుశా లాలూ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని రంగంలోకి దింపుతారేమో చూడాలి.

This post was last modified on October 10, 2020 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

10 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

41 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago