Political News

బీహార్ లో ఆర్జేడీకి ఊహించని దెబ్బ

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆర్జేడీకి ఊహించని దెబ్బ పడింది. బీహార్ మాజీ, ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు లాలూ ప్రసాదయాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకావాలు లేవని తేలిపోయింది. పశుదాణా కేసులో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తారని అందరు అనుకున్నారు. ఆర్జేడీకి ప్రస్తుత ఎన్నికల్లో గెలవటం చాలా అవసరం. లాలూ తరపున ఆయన కొడుకు తేజస్వీ యాదవే అన్నీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో ఈ పార్టీ 143 సీట్లలో పోటి చేస్తోంది. మరో 70 సీట్లకు కాంగ్రెస్ పోటి చేస్తుంటే మిగిలిన సీట్లలో చిన్నా చితకా భాగస్వామ్య పార్టీలు పోటి చేస్తున్నాయి.

విషయం ఏమిటంటే ఈ ఎన్నికలు ఇటు ఎన్డీఏ కూటమికి అటు యూపీఏ కూటమికి రెండింటికి చాలా కీలకమే. రెండు కూటముల్లోను మైనసులున్నాయి, ప్లస్సులున్నాయి. కాకపోతే ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా పాల్గొంటారు. ఎన్నికల వ్యూహాలను అమిత్ తెర వెనుక నుండి నడిపిస్తారు. ఇదే సమయంలో యూపీఏ కూటమి తరపున ప్రచారానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి వస్తారో లేదో తెలీదు. ఇదే సమయంలో రాహూల్ గాంధి, ప్రియాంకా గాంధి రావటం ఖాయమైంది. సరే మోడి, అమిత్ , రాహూల్, ప్రియాంకా ఇలా ఎంతమంది వచ్చిన అందరు బయటవాళ్ళే అన్నది మరచిపోకూడదు.

కానీ లోకల్ అనే ట్యాగ్ ఉన్న వాళ్ళల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలు మాత్రం కొద్ది మందే ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఇంపార్టెంట్. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లాలూ బెయిల్ పై బయటకు వచ్చేయటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొని చక్రం తిప్పటం ఖాయమనే అందరు అనుకున్నారు. దానికి తగ్గట్లే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది లాలూ వచ్చేయటం ఖాయమే అనుకుంటున్న సమయంలో ఊహించని రితిలో బ్రేకులు పడ్డాయి. ట్రెజరిని మోసం చేసి రూ. 3.3 కోట్లను కాజేసిన కేసు కూడా లాలూపై మరో కేసుంది. ఈ కేసులో కూడా శిక్షపడింది.

అంటే రెండు కేసుల్లో పడిన శిక్షల్లో ఒకదానికి బెయిల్ వచ్చినా మరో కేసు శిక్ష విషయంలో లాలూకు బెయిల్ దొరకలేదు. ఎన్నికల్లోపు బెయిల్ దొరికే అవకాశం కూడా లేదని సమాచారం. ఈ పరిణామాన్ని ఆర్జేడీ ఏమాత్రం ఊహించలేదు. గడచిన 40 ఏళ్ళల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి లాలూ దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఆ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా లాలూ ప్రచారం చేయలేదు. ఇక లాలూ బయటకు వచ్చే అవకాశం లేదని తేలిపోవటంతో ప్రత్యామ్నాయంగా ప్రచార బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. బహుశా లాలూ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని రంగంలోకి దింపుతారేమో చూడాలి.

This post was last modified on October 10, 2020 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

55 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago