Political News

ఉపన్యాసాలు ఇస్తే గెలవం.. అంబటి వేదాంతం!

2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, చాలామంది వైసీపీ నేతలు లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. తక్కువలో తక్కువ 20వేల నుంచి మొదలుకొని లక్ష ఓట్ల మెజారిటీతో వైసిపి ఎమ్మెల్యేలు ఓటమిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

టీవీ డిబేట్లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ లలో ఉపన్యాసాలు ఇస్తే కుదురుతుందా? నాకు 28 వేల ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పని చేయకుండా ఊరికే ఉపన్యాసాలు ఇస్తే టీవీలో మాట్లాడితే కుదిరిద్దా? కుదరదు. నేను బ్రహ్మాండంగా టీవీల్లో మాట్లాడుతాను…మొన్న 28,000 మైనస్ వచ్చింది……మామూలుగా కాదు నాకే ఏం చేయాలో అర్థం కాకుండా రెండు రోజులు బయటకు రాలేదు… అని అంబటి రాంబాబు అన్నారు.

అయితే తనకు తర్వాత ధైర్యం వచ్చిందని, ఇంకొకాయన 90వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని, వాళ్లకన్నా మనం బెటర్ అని అనుకున్నానని, ఆ తర్వాత ఇక్కడ 50,000 మెజారిటీతో ఓడిపోయారని తెలిసిందని చెప్పుకొచ్చారు. 28 వేలు అంటే టైట్ ఫైట్ ఇచ్చానని ఓ పెద్దాయన అన్నారాని తెలిపారు. ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ 28 వేల మెజారిటీతో ఓడిపోతే టైట్ ఫైట్ ఏమిటి అనుకున్నానని, కానీ, మిగతా వాళ్ళ ఓటమి మార్జిన్ చూస్తే వారికన్నా బెటర్ కదా అని తాను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.

2014లో 924 ఓట్లతో ఓడిపోయానని. అప్పట్లో నిద్రపట్టేది కాదని కానీ మొన్న నిద్ర పట్టిందని చెప్పారు. 28 వేల మెజార్టీతో ఓడిపోయినా సరే నిద్రపోయానని, ఏం చేసినా గెలిచి చచ్చే వాళ్ళం కాదులే అని అనిపించిందని రాంబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇదని, కాకపోతే అంబటి బయటపడ్డారని మిగతావారు బయటపడలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వైసిపి నేతల దుస్థితి చూసి వారిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

This post was last modified on December 12, 2024 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

46 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago