2024 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్ తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. అవమానభారంతో ఉన్న సమయంలోనే పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీలలో చేరడం, పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్ కు షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో షాక్ లో ఉన్నారు జగన్.
ఆ షాక్ నుంచి తేరుకోకముందే జగన్ కు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భారీ షాకిచ్చారు. వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని గ్రంధి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు.
చాలా కాలంగా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై శ్రీనివాస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. శ్రీనివాస్ టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రకారమే కొందరు టిడిపి నేతలతో ఆల్రెడీ ఆయన మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గ్రంధి శ్రీనివాస్ ఓడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 12, 2024 12:07 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…