ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన ముందడుగు పడుతోంది. జనవరి నుంచి ‘వాట్సాప్ పాలన’కు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 1వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్నితాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు.
ఏంటీ పాలన..
వాట్సాప్ అనేది.. ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు.. ఫొటోలు.. వీడియోలు ఇలా.. అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఓ భాగం అయిపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారత దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాట్సాప్లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు.. వాట్సాప్ సేవలు అందుతున్నాయి. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలు అందించనుంది. ఎడారి దేశం దుబాయ్లో ఈ ప్రయోగం సక్సెస్అయింది.
ఏం చేస్తారు?
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…