ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన ముందడుగు పడుతోంది. జనవరి నుంచి ‘వాట్సాప్ పాలన’కు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 1వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్నితాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు.
ఏంటీ పాలన..
వాట్సాప్ అనేది.. ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు.. ఫొటోలు.. వీడియోలు ఇలా.. అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఓ భాగం అయిపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారత దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాట్సాప్లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు.. వాట్సాప్ సేవలు అందుతున్నాయి. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలు అందించనుంది. ఎడారి దేశం దుబాయ్లో ఈ ప్రయోగం సక్సెస్అయింది.
ఏం చేస్తారు?
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…