Political News

రేపే లాస్ట్ డేట్‌.. చంద్ర‌బాబు నిర్ణ‌యంపై టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌.. !

కూట‌మి పార్టీల నాయ‌కులు టెన్ష‌న్‌లో మునిగిపోయారు. రాజ్య‌స‌భ సీట్లకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో ఈ సీట్ల‌ను ఆశిస్తున్న‌వారు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి పోటీ ఉంటే ఎన్నిక‌లు పెడ‌తారు. లేక‌పోతే.. ఏకగ్రీవంగా ప్ర‌క‌టించ‌నున్నారు. దీనికి సంబంధించి మ‌రో ఒక్క రోజు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్ర‌కారం.. సోమ‌వారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుంది.

దీంతో ఆశావ‌హులు.. ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబును క‌లిసిన వారు కూడా.. ఎదురు చూస్తున్నారు. ఎవ‌రికి ఈ ప‌దువులు ద‌క్కుతాయోన‌ని వారు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ కానీ, బీజేపీ కానీ.. చాలా గోప్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికి అందిన స‌మాచారం ప్ర‌కారం.. మూడు సీట్ల‌కు ముగ్గురిని ఇప్ప‌టికే ఖ‌రారు చేశారు. అయితే..వీరిలో ఎవ‌రు ఉన్నార‌న్న‌ది మాత్రం అత్యంత ర‌హ‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు, ఆర్ .కృష్ణయ్య‌లు పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఆ పార్టీతో పాటు రాజ్య‌స‌భ సీట్ల‌ను కూడా వ‌దులుకున్నారు. వీరిలో మోపిదేవి రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చోటు కోరుకుంటున్నారు. అయితే.. బీద మ‌స్తాన్ రావు మాత్రం తిరిగి రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని కోరుతున్నారు. ఇక‌, ఆర్‌. కృష్ణ‌య్య కూడా.. బీజేపీ త‌ర‌ఫున పెద్ద‌ల స‌భ‌కు వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో సీటు ఖాళీగా ఉంది.

దీనికి మాజీ మంత్రి దేవినేని ఉమా స‌హా అనేక మంది పోటీలో ఉన్నారు. ఇక‌, సినీరంగానికి చెందిన రాఘ‌వేంద్ర‌రావుపేరు కూడా జోరుగా నే తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ఎన్నారై సానా స‌తీష్ కూడా ప్ర‌య‌త్నంచేశారు. మ‌రికొంద‌రు ఇప్పటికే చంద్ర‌బాబును క‌లిసి విన్న‌వించారు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున నాగ‌బాబును పంపించాల‌ని ప‌వ‌న్ ప్ర‌య‌త్నించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. వీరిలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నేది అత్యంత గోప్యంగా ఉంచ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 9, 2024 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

34 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

49 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago