వైసీపీలో చిత్రమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. జగన్ను నమ్మిన వారు.. కొందరైతే, జగనే స్వయం గా నమ్మిన నాయకులు మరికొందరు. ఈ రెండు వర్గాలతోనూ.. పార్టీకి కానీ, అధినేతకు కానీ ఒరిగింది ఏమైనా ఉందా? అంటే చెప్పడం కష్టంగానే ఉందనాలి. ఎందుకంటే.. రాజకీయంగా కొందరిని జగన్ ప్రొత్సహించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నాయకులు ఉన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, మైనారిటీ నాయకులు పార్టీని బాగానే చూస్తున్నారు.
కానీ, వీరితో పోల్చుకుంటే.. టీడీపీని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీసీలకు జగన్ ఎక్కువగా పదవులు పంచా రు. రాజ్యసభ నుంచి మంత్రివర్గం వరకు అనేక మందికి ఆయన పదవులు పంపిణీ చేశారు.కానీ, వీరు మాత్రం పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. జంపింగుల బాట పట్టారు. దీంతో జగన్ నమ్మి.. పదవులు ఇచ్చిన వారంతా కూడా.. సగానికిపైగానే పార్టీకి దూరమయ్యారు. ఇక, జగన్ను నమ్మిన వారి విషయానికి వస్తే.. ఈ జాబితా పెద్దదిగానే ఉంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, గడికోట శ్రీకాంత్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రుడ్డి సహా అనేక మంది ఈ జాబితాలోనూ ఉన్నారు. అయితే.. వీరిలో పదవులు దక్కని వారే ఉన్నారు. ఆది నుంచి పార్టీకి కంటికి రెప్పగా వ్యవహరించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వారందరికీ జగనే సర్వస్వం. అయితే.. వీరికి మా త్రం జగన్ పెద్దగా పదవులు ఇచ్చింది లేదు. ఇస్తానని చెప్పింది కూడా లేదు. దీంతో వీరిలో అసంతృప్తి పెరిగిపోయింది.
అంటే.. ఇతమిత్థంగా.. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. చివరి నిముషంలో ఎలాంటి మార్పులు జరుగుతా యో.. ఎవరికి పదవులు దక్కుతాయో.. అనే ఆవేదన, ఆందోళన వంటివి జగన్ను నమ్మిన నాయకుల్లో స్ప ష్టంగా కనిపిస్తుండడంగమనార్హం. దీంతో వారంతా పార్టీలోనే ఉన్నప్పటికీ.. యాక్టివ్రోల్ అయితే పోషించ డం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్నవారికి జగన్ భరసా ఇవ్వాల్సి ఉంటంది. సామాజిక వర్గాల ప్రాతిపదికన కాకుండా.. కష్టపడే వారి ప్రాతిపదికగా .. ఆయన ప్రాధాన్యం ఇస్తే.. పార్టీ పరుగులు పెడుతుందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…
కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…
తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు…
సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ…
ఇండియాలో క్రికెట్ పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందున్నంత ఇంటెన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఓటమితో…