Political News

పెట్టుబడులు పెట్టాల్సింది కాంట్రాక్టర్ల మీద కాదు, టీచర్స్ మీద : పవన్

కడప మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యాపకులు, విద్యార్థుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల మీద కాకుండా అధ్యాపకుల మీద పెట్టబుడులు పెట్టాలని, అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ గా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ అన్నారు.

తాను ఒక సినిమా హీరోగా చెబుతున్నానని, సినిమాల్లోనే విద్యార్థులు హీరోలను చూసుకోవద్దని, అధ్యాపకులలో కూడా హీరోలుంటారని పవన్ చెప్పారు. విద్యార్థులకు ఒక మహిళా పీఈటీ టీచర్ రెజ్లింగ్ లో అద్భుతంగా శిక్షణ ఇచ్చారని, ఆ విద్యార్థులు వెళ్లి బ్రాంజ్ మెడల్ సాధించారని, తన దృష్టిలో ఆవిడ హీరో అని పవన్ చెప్పారు. తనకు అధ్యాపకులంటే చాలా గౌరవమని పవన్ అన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గరు పిల్లలను హ్యాండిల్ చేయడమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో, సెక్షన్ కు 30 మంది పిల్లలను టీచర్లు హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదని అన్నారు.

పిల్లల చదువు, వికాసం కోసం ప్రభుత్వాలు ట్యాబ్ లు ఇస్తున్నాయని, అయితే, ఆ ట్యాబ్ లు వారు దేనికి వాడుతున్నారు, చెడు మార్గాలవైపు వెళుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం, చెడు ప్రభావాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. కడప నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారని, అయితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కాదని…ఏం చేశారు అన్నది ముఖ్యమని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఒకేలా చూడాలని హితవు పలికారు.

This post was last modified on December 8, 2024 6:53 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

21 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago