కడప మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యాపకులు, విద్యార్థుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల మీద కాకుండా అధ్యాపకుల మీద పెట్టబుడులు పెట్టాలని, అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ గా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ అన్నారు.
తాను ఒక సినిమా హీరోగా చెబుతున్నానని, సినిమాల్లోనే విద్యార్థులు హీరోలను చూసుకోవద్దని, అధ్యాపకులలో కూడా హీరోలుంటారని పవన్ చెప్పారు. విద్యార్థులకు ఒక మహిళా పీఈటీ టీచర్ రెజ్లింగ్ లో అద్భుతంగా శిక్షణ ఇచ్చారని, ఆ విద్యార్థులు వెళ్లి బ్రాంజ్ మెడల్ సాధించారని, తన దృష్టిలో ఆవిడ హీరో అని పవన్ చెప్పారు. తనకు అధ్యాపకులంటే చాలా గౌరవమని పవన్ అన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గరు పిల్లలను హ్యాండిల్ చేయడమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో, సెక్షన్ కు 30 మంది పిల్లలను టీచర్లు హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదని అన్నారు.
పిల్లల చదువు, వికాసం కోసం ప్రభుత్వాలు ట్యాబ్ లు ఇస్తున్నాయని, అయితే, ఆ ట్యాబ్ లు వారు దేనికి వాడుతున్నారు, చెడు మార్గాలవైపు వెళుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం, చెడు ప్రభావాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. కడప నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారని, అయితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కాదని…ఏం చేశారు అన్నది ముఖ్యమని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఒకేలా చూడాలని హితవు పలికారు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…