Political News

టీడీపీలోకి వాసిరెడ్డి ప‌ద్మ‌!

వైసీపీకి కొన్నాళ్ల కిందట రాజీనామా చేసిన ఏపీ మ‌హిళా క‌మిష‌న్ మాజీ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ.. తెలుగు దేశం పార్టీలోకి అరంగేట్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన ఆమె.. ఎంపీ చిన్నీ కార్యాల‌యంలో సుమారు గంట సేపు మంత‌నాలు జ‌రిపారు. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే సూచ‌న‌ల మేర‌కు ఆమె టీడీపీలో చేర‌నున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆది నుంచి సీనియ‌ర్ నేత‌తో క‌లిసి ఆమె అడుగులు వేశార‌ని, ఈ క్ర‌మంలో ఆ నేత సూచ‌న‌లు పాటిస్తున్నార‌ని స‌మాచారం.

2004-05 మ‌ధ్య రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన ప‌ద్మ‌.. తొలినాళ్ల‌లో కాంగ్రెస్‌లో ఉన్నారు. త‌ర్వాత‌.. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్ట‌డంతో చిరంజీవికి జైకొట్టారు. ఆ త‌ర్వాత‌.. ఆపార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన త‌ర్వాత‌.. వైసీపీ ఏర్పాటు చేయ‌డంతో ఆ పార్టీలోకి వ‌చ్చారు. ఇలా.. పుష్క‌ర కాలంగా వైసీపీలో కొన‌సాగారు. పార్టీ అధికార ప్ర‌తినిధిగా వాసిరెడ్డి వ్య‌వ‌హ‌రించారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డం, ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన నేప‌థ్యంలో వైసీపీలో ఆమెకు బ‌ల‌మైన మ‌ద్ద‌తే ల‌భించింది. అయితే.. జ‌గ్గ‌య్య‌పేట సీటును ఆశించిన ఆమె 2019లోను, 2024లోను భంగ ప‌డ్డారు.

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఖ‌చ్చితంగా టికెట్ తెచ్చుకుని విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. అయితే.. జ‌గ‌న్ ఆమెకు టికెట్ నిరాక‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆమెను సంతృప్తి ప‌రిచేందుకు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ పోస్టును ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె ముభావంగానే ప‌నిచేశారు. ఇక‌, ఆ త‌ర్వాత‌ నుంచి ఆమె చూపు మారిపోయింది. ఇటీవ‌ల నెల రోజుల కింద‌ట వైసీపీకి రాజీనామా చేశారు. దీనికి ముందే… ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు రెండు వారాల ముందు.. మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ పోస్టుకు కూడా రాజీనామా స‌మ‌ర్పించారు. అనంత‌రం.. మాజీ సీఎం జ‌గ‌న్ కేంద్రంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యార‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. టీడీపీలోకి వ‌చ్చాక‌.. ఆమె తిరిగి మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ పోస్టును పొందే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీనికి సంబంధించి టీడీపీ నాయ‌కులు బహిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా.. నారా లోకేష్‌ సమక్షంలో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరనున్నార‌ని మాత్రం క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని స‌మాచారం. దీనికి అధినేత చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

Satya

Recent Posts

1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

4 minutes ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

23 minutes ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

2 hours ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

8 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

8 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

9 hours ago