Political News

జగన్ కేసులపై విచారణ స్పీడందుకుంటుందా ?

ఆదాయానికి మించిన ఆక్రమాస్తులున్నాయని నమోదైన కేసుల్లో జగన్మోహన్ రెడ్డిపై శుక్రవారం ఈడీ కోర్టులో విచారణ జరుగుతుందా ? ఈ అంశంపై అందరిలోను ఉత్కంఠ మొదలైంది. నేరచరితులైన ప్రజా ప్రతినిధులపై రోజువారీ విచారణలు జరగాలంటూ హైకోర్టు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రెగ్యులర్ కోర్టులోనే జగన్ కు సంబంధించిన అనేక కేసులు వివిధ కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు కొన్ని కేసుల విచారణ జరగబోతున్నాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిన తర్వాత అప్పట్లో జగన్ పై ఒక్కసారిగా కేసులు నమోదయ్యాయి. విచారణ పేరుతో సీబీఐ జగన్ ను అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసి 16 మాసాలు జైలులో ఉంచిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2009లో నమోదైన సీబీఐ, ఈడీ కేసులపై విచారణ నత్తకే నడకలు నేర్పుతున్నట్లుగా ఉందనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఒక దశలో తనపై జరుగుతున్న విచారణలో స్పీడు పెంచాలంటూ స్వయంగా జగనే కోర్టులకు విజ్ఞప్తి చేసుకున్నా విచారణలో వేగమైతే పెరగలేదు.

ఈ నేపధ్యంలోనే ఈరోజు హెటిరో, అరిబిందో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నా, భారతి, దాల్మియా సిమెంట్స్ కంపెనీలకు లీజులు, ఇందూగ్రూపు, వాన్ పిక్ కంపెనీలకు భూ కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులపై విచారణ జరుగుతుంది. వీటితో పాటు ఎమ్మార్ విల్లాలు, ప్లాట్ల కేటాయింపుపై నమోదైన కేసు, ఓటుళాపురం గనుల లీజు వ్యవహారం, జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి మనీ ల్యాండరింగ్ ఆరోపణలపైన కూడా విచారణ జరుగుతుంది.

మొత్తానికి ప్రత్యేకకోర్టులో కానీ లేకపోతే రెగ్యులర్ కోర్టులో కానీ జగన్ కేసులపై జరుగుతున్న విచారణలో స్పీడు పెరిగితే కేసులు తొందరగా తెమిలే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ పై ఎన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది ? ఎన్ని కేసులను కోర్టు కొట్టేసింది ? లాంటి అనేక విషయాలపై జనాల్లో క్లారిటి లేదు. అసలు జగన్ పై నమోదైన కేసుల్లో పసుందా లేదా కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే తనపై రాజకీయ కక్షతోనే రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టినట్లు జగన్ మొదటినుండి వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత గులాం నబీ ఆజాద్ ఆమధ్య మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ లోనే ఉండుంటే అసలు కేసులే ఉండేవి కావంటు చేసిన వ్యాఖ్యలు జగన్ ఆరోపణలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఏదేమైనా కేసుల్లో విచారణ జరిపి తప్పు జరిగిందో లేదో తేల్చేస్తేనే మంచిది.

This post was last modified on October 9, 2020 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

56 minutes ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

1 hour ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

2 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

2 hours ago

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో..…

2 hours ago

ఫ్యాన్స్ మనోభావాలతో అప్డేట్స్ ఆట

స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు  ప్రాణం…

2 hours ago