Political News

రెండు జిల్లాల్లో ఆ ‘ఎంపీ ‘ మాటే రైట్ రైట్‌.. !

రెండు జిల్లాల‌ను ఒకే ఎంపీ శాసిస్తున్నారా? త‌న ఆధిప‌త్య పోరులో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. క‌డ‌ప నుంచి ఉత్త‌రాంధ్ర‌కు వ‌చ్చి విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీ సీఎం ర‌మేష్‌. ఆయ‌న సొంత జిల్లా క‌డ‌ప‌. కానీ, రాజ‌కీయంగా వ‌చ్చిన అవ‌కాశంతో ఆయ‌న అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఇప్పుడు అటు క‌డ‌ప‌లోను, ఇటు అన‌కాప‌ల్లిలోనూ.. త‌న‌దైన రాజ‌కీయాల‌కు తెర‌దీశారు.

అయితే.. ఈ రాజ‌కీయాలు అభివృద్ధికి అనుగుణంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ, రాజ‌కీయంగా వివాదాలకు, విభేదాల‌కు తావిస్తుండ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులకు ఎంపీకి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం సాగుతోంది. సీఎం ర‌మేష్‌కు వ్య‌తిరేకంగా ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు ఫిర్యాదుల‌పై ఫిర్యాదులు మోస్తున్నార‌ని స‌మాచారం. కానీ, సీఎం ర‌మేష్‌కు సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న ప‌లుకుబడి.. ఇత‌ర‌త్రా అనుబంధాల‌తో ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేక పోతున్నారు.

ఇక‌, క‌డ‌ప‌లో బీజేపీ నాయ‌కుడు.. ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డితో సీఎం ర‌మేష్ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. ఆదికి వ్య‌తిరేకంగా సీఎం ర‌మేష్‌.. ఎంత‌కైనా అన్న‌ట్టు రాజ‌కీయాలు చేస్తున్నారు. కాంట్రాక్టుల నుంచి స్థానిక పాలిటిక్స్ వ‌ర‌కు.. కూడా ఆదిపై సై అంటే సై అంటూ.. సీఎం ర‌మేష్‌.. రోడ్డెక్కుతున్నారు. అయితే.. ఆయ‌న బ‌య‌ట‌కు రాకుండా. తెర‌వెనుక ఉండి చ‌క్రం తిప్పుతున్నార‌నేది ఆది వ‌ర్గం చెబుతున్న మాట‌. ఇటీవ‌ల వెలుగు చూసిన ఫ్లైయాష్ వివాదంలో కూడా సీఎం రమేష్ ఉన్నార‌న్న‌ది తాజాగా వెలుగు చూసిన విష‌యం.

బీజేపీ నేత ఆది నారాయ‌ణ‌పై పైచేయి సాధించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీకి సీఎం ర‌మేష్ స‌హ‌క‌రిస్తున్నార‌ని.. బీజేపీలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట‌. కానీ, బీజేపీలోనూ పెద్ద‌ల‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు.. ఈ విష‌యంలో ఆదిని క‌ట్టిప‌డేస్తున్నాయి. దీంతో ఆయ‌న‌కు విష‌యం తెలిసినా.. కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అటు అన‌కాప‌ల్లిలో టీడీపీతోనూ.. ఇటు క‌డ‌ప‌లో బీజేపీతోనూ.. రాజ‌కీయాలు బాగానే చేస్తున్నార‌న్న టాక్ అయితే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 10, 2024 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘2000 నోట్లు’ దాచేశారు.. లెక్క‌లు తీస్తున్న ఐటీ!

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి ఈ ఏడాది జూన్ - జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్ర‌మాలు,…

10 minutes ago

బ్రెజిల్‌లో రూ.40 కోట్లకు ఒంగోలు ఆవు

బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ…

12 minutes ago

తండేల్ బిజినెస్ టార్గెట్ ఎంత

ఇంకో మూడు రోజుల్లో తండేల్ విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత పెద్ద సినిమా ఇదే కావడంతో బయ్యర్ వర్గాలు…

14 minutes ago

గీత ఆర్ట్స్ నుండి బయటకి? : వాసు ఏమన్నారంటే…

టాలీవుడ్లో గొప్ప చరిత్ర ఉన్న బేనర్లలో ‘గీతా ఆర్ట్స్’ ఒకటి. ఆ సంస్థను నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు…

1 hour ago

ప్రభాస్ & తారక్…ఇద్దరినీ బ్యాలన్స్ చేస్తున్న మైత్రి

ఒక సమయంలో ఒక ప్యాన్ ఇండియా మూవీని నిర్మించడానికే నిర్మాతలు కిందా మీదా పడుతున్న రోజులివి. ఏ మాత్రం ఆలస్యం…

1 hour ago

బీఆర్ఎస్ కు బూస్ట్…వారంతా రిప్లై ఇచ్చి తీరాల్సిందే

తెలంగాణలో జోరుగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులకు చెక్ పడే దిశగా మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం…

1 hour ago