Political News

గ్రామీణ స్థాయిలో వైసీపీకి భ‌ర‌తం.. రేప‌టి నుంచే!

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న కూట‌మి స‌ర్కారు గ‌త వైసీపీ స‌ర్కారు త‌ప్పుల‌ను లెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇసుక స‌హా.. అనేక వ్వ‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేత‌లు చేసిన త‌ప్పుల‌ను వెలికి తీసేందుకు ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం(డిసెంబ‌రు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజ‌లు పాటు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నారు.

ఈ స‌ద‌స్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌నున్నారు. వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన ‘రీస‌ర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మ‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్త‌గా భూములు ద‌ఖ‌లు ప‌డ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్న‌వారికి మూడు ఎక‌రాలు ఉన్నట్టుగా రికార్డుల్లో న‌మోదు చేశారు. ఇది త‌ప్పు వ‌ల్ల జ‌రిగిందో ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందో తేల్చ‌నున్నారు. ఇలాంటి అనేక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌నున్నారు.

అలాగే.. వైసీపీ నాయ‌కులు క‌బ్జా చేసిన భూముల‌ను కూడా ఈ రెవెన్యూ స‌ద‌స్సుల్లో వెలికి తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాల‌ని అధికారుల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ స‌ద‌స్సుల‌కు మంత్రులు కూడా హాజ‌రు కానున్నారు. త‌ద్వారా మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఈ స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్న సంకేతాలు పంపించిన‌ట్టు అయింది.

ఇదే విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ స‌ద‌స్సుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని గ్రామీణుల‌ను ఆయ‌న కోరారు. ఇది చ‌క్క‌టి అవ‌కాశంగా పేర్కొన్న అయ్య‌న్న‌.. రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని కోరారు. దీనికి సంబంధించి ఆయ‌న సెల్పీ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. త‌ద్వారా వైసీపీ గ్రామ‌స్థాయి నాయ‌కుల అక్ర‌మాల‌ను వెలికి తీయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago