ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి సర్కారు గత వైసీపీ సర్కారు తప్పులను లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక సహా.. అనేక వ్వవస్థలను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చేసిన తప్పులను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజలు పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన ‘రీసర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్తగా భూములు దఖలు పడ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్నవారికి మూడు ఎకరాలు ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇది తప్పు వల్ల జరిగిందో ఉద్దేశ పూర్వకంగా జరిగిందో తేల్చనున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై దృష్టి పెట్టనున్నారు.
అలాగే.. వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూములను కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ సదస్సులకు మంత్రులు కూడా హాజరు కానున్నారు. తద్వారా మరింత పారదర్శకంగా ఈ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపించినట్టు అయింది.
ఇదే విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణులను ఆయన కోరారు. ఇది చక్కటి అవకాశంగా పేర్కొన్న అయ్యన్న.. రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన సెల్పీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తద్వారా వైసీపీ గ్రామస్థాయి నాయకుల అక్రమాలను వెలికి తీయనున్నట్టు పేర్కొన్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…