Political News

గ్రామీణ స్థాయిలో వైసీపీకి భ‌ర‌తం.. రేప‌టి నుంచే!

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న కూట‌మి స‌ర్కారు గ‌త వైసీపీ స‌ర్కారు త‌ప్పుల‌ను లెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇసుక స‌హా.. అనేక వ్వ‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేత‌లు చేసిన త‌ప్పుల‌ను వెలికి తీసేందుకు ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం(డిసెంబ‌రు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజ‌లు పాటు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నారు.

ఈ స‌ద‌స్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌నున్నారు. వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన ‘రీస‌ర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మ‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్త‌గా భూములు ద‌ఖ‌లు ప‌డ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్న‌వారికి మూడు ఎక‌రాలు ఉన్నట్టుగా రికార్డుల్లో న‌మోదు చేశారు. ఇది త‌ప్పు వ‌ల్ల జ‌రిగిందో ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందో తేల్చ‌నున్నారు. ఇలాంటి అనేక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌నున్నారు.

అలాగే.. వైసీపీ నాయ‌కులు క‌బ్జా చేసిన భూముల‌ను కూడా ఈ రెవెన్యూ స‌ద‌స్సుల్లో వెలికి తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాల‌ని అధికారుల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ స‌ద‌స్సుల‌కు మంత్రులు కూడా హాజ‌రు కానున్నారు. త‌ద్వారా మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఈ స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్న సంకేతాలు పంపించిన‌ట్టు అయింది.

ఇదే విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ స‌ద‌స్సుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని గ్రామీణుల‌ను ఆయ‌న కోరారు. ఇది చ‌క్క‌టి అవ‌కాశంగా పేర్కొన్న అయ్య‌న్న‌.. రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని కోరారు. దీనికి సంబంధించి ఆయ‌న సెల్పీ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. త‌ద్వారా వైసీపీ గ్రామ‌స్థాయి నాయ‌కుల అక్ర‌మాల‌ను వెలికి తీయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

This post was last modified on December 5, 2024 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

3 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

3 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

3 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

3 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

4 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

5 hours ago