ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి సర్కారు గత వైసీపీ సర్కారు తప్పులను లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక సహా.. అనేక వ్వవస్థలను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చేసిన తప్పులను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజలు పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన ‘రీసర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్తగా భూములు దఖలు పడ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్నవారికి మూడు ఎకరాలు ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇది తప్పు వల్ల జరిగిందో ఉద్దేశ పూర్వకంగా జరిగిందో తేల్చనున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై దృష్టి పెట్టనున్నారు.
అలాగే.. వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూములను కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ సదస్సులకు మంత్రులు కూడా హాజరు కానున్నారు. తద్వారా మరింత పారదర్శకంగా ఈ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపించినట్టు అయింది.
ఇదే విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణులను ఆయన కోరారు. ఇది చక్కటి అవకాశంగా పేర్కొన్న అయ్యన్న.. రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన సెల్పీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తద్వారా వైసీపీ గ్రామస్థాయి నాయకుల అక్రమాలను వెలికి తీయనున్నట్టు పేర్కొన్నారు.
This post was last modified on December 5, 2024 3:49 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…