ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి సర్కారు గత వైసీపీ సర్కారు తప్పులను లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక సహా.. అనేక వ్వవస్థలను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చేసిన తప్పులను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజలు పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన ‘రీసర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్తగా భూములు దఖలు పడ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్నవారికి మూడు ఎకరాలు ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇది తప్పు వల్ల జరిగిందో ఉద్దేశ పూర్వకంగా జరిగిందో తేల్చనున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై దృష్టి పెట్టనున్నారు.
అలాగే.. వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూములను కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ సదస్సులకు మంత్రులు కూడా హాజరు కానున్నారు. తద్వారా మరింత పారదర్శకంగా ఈ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపించినట్టు అయింది.
ఇదే విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణులను ఆయన కోరారు. ఇది చక్కటి అవకాశంగా పేర్కొన్న అయ్యన్న.. రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన సెల్పీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తద్వారా వైసీపీ గ్రామస్థాయి నాయకుల అక్రమాలను వెలికి తీయనున్నట్టు పేర్కొన్నారు.
This post was last modified on December 5, 2024 3:49 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…