Political News

గ్రామీణ స్థాయిలో వైసీపీకి భ‌ర‌తం.. రేప‌టి నుంచే!

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న కూట‌మి స‌ర్కారు గ‌త వైసీపీ స‌ర్కారు త‌ప్పుల‌ను లెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇసుక స‌హా.. అనేక వ్వ‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేత‌లు చేసిన త‌ప్పుల‌ను వెలికి తీసేందుకు ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం(డిసెంబ‌రు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజ‌లు పాటు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నారు.

ఈ స‌ద‌స్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌నున్నారు. వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన ‘రీస‌ర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మ‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్త‌గా భూములు ద‌ఖ‌లు ప‌డ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్న‌వారికి మూడు ఎక‌రాలు ఉన్నట్టుగా రికార్డుల్లో న‌మోదు చేశారు. ఇది త‌ప్పు వ‌ల్ల జ‌రిగిందో ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందో తేల్చ‌నున్నారు. ఇలాంటి అనేక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌నున్నారు.

అలాగే.. వైసీపీ నాయ‌కులు క‌బ్జా చేసిన భూముల‌ను కూడా ఈ రెవెన్యూ స‌ద‌స్సుల్లో వెలికి తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాల‌ని అధికారుల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ స‌ద‌స్సుల‌కు మంత్రులు కూడా హాజ‌రు కానున్నారు. త‌ద్వారా మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఈ స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్న సంకేతాలు పంపించిన‌ట్టు అయింది.

ఇదే విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ స‌ద‌స్సుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని గ్రామీణుల‌ను ఆయ‌న కోరారు. ఇది చ‌క్క‌టి అవ‌కాశంగా పేర్కొన్న అయ్య‌న్న‌.. రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని కోరారు. దీనికి సంబంధించి ఆయ‌న సెల్పీ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. త‌ద్వారా వైసీపీ గ్రామ‌స్థాయి నాయ‌కుల అక్ర‌మాల‌ను వెలికి తీయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

This post was last modified on December 5, 2024 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

35 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago