ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అది కాకుండా, ఎక్స్ లో, మీడియాలో, తన కార్యాలయం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా నాయకుడు అనిపించుకుంటున్నారు లోకేశ్. ఎన్నికలై పోయాయి…జనంతో ఏం పని అనుకోకుండా జనంతోనే మనం అన్న రీతిలో లోకేశ్ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ ను లోకేేశ్ రద్దు చేయించారు.కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్న లోవరాజు సస్పెండ్ అయ్యారు. బస్సు డ్రైవ్ చేస్తుండగా ఓ ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సును కాసేపు ఆపాల్సి వచ్చింది. దీంతో, ప్రయాణికులను ఎంటర్ టైన్ చేద్దామని లోవరాజు బస్సు దిగి సరదాగా దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు.
అయితే, ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. లోవరాజు డ్యాన్స్ కు కాంప్లిమెంట్స్ వచ్చాయి..ఉద్యోగం పోయింది. దీంతో, లోవరాజు సస్పెన్షన్ ను లోకేశ్ రద్దు చేయించారు. దీంతో, లోకేష్ ను లోవరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ధన్యవాదాలు చెప్పారు. లోకేశ్ కు అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ హామీనిచ్చారు.
This post was last modified on December 4, 2024 10:13 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…