గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అంటూ భారీగా అక్రమాలు, దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి వల్ల రాష్ట్ర ఖజానాకి దాదాపు 160 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో, విచారణ జరిపిన అధికారులు వెంకట రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో, వెంకటరెడ్డిని సెప్టెంబరులో అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే, జైలులో వెంకటరెడ్డికి రాజభోగాలు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, బయటి భోజనం…ఇలా వెంకట రెడ్డిని జైల్లో సిబ్బంది కొత్త పెళ్లి కొడుకులా చూస్తున్నారట. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో జైలు సిబ్బందిపై ఆయన ఫైర్ అయ్యారట. జైల్లో వెంకట రెడ్డి వంటి వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారట. అంతేకాదు, వెంకట రెడ్డికి ఎవరు సహకరించారో పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారట.
అంతకుముందు కూడా వైసీపీ మాజీ నేత బోరుగడ్డ అనిల్ కు కూడా పోలీస్ స్టేషన్లో వసతులు కల్పించడం, స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్లో భోజనం పెట్టించడం వంటి వ్యవహారాలపై విమర్శలు వచ్చాయి. ఇక పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ కు, ఆయన కోసం వచ్చిన బంధువులకు కుర్చీలు వేసి పోలీసులు మర్యాదలు చేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2024 4:36 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…