గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అంటూ భారీగా అక్రమాలు, దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి వల్ల రాష్ట్ర ఖజానాకి దాదాపు 160 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో, విచారణ జరిపిన అధికారులు వెంకట రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో, వెంకటరెడ్డిని సెప్టెంబరులో అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే, జైలులో వెంకటరెడ్డికి రాజభోగాలు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, బయటి భోజనం…ఇలా వెంకట రెడ్డిని జైల్లో సిబ్బంది కొత్త పెళ్లి కొడుకులా చూస్తున్నారట. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో జైలు సిబ్బందిపై ఆయన ఫైర్ అయ్యారట. జైల్లో వెంకట రెడ్డి వంటి వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారట. అంతేకాదు, వెంకట రెడ్డికి ఎవరు సహకరించారో పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారట.
అంతకుముందు కూడా వైసీపీ మాజీ నేత బోరుగడ్డ అనిల్ కు కూడా పోలీస్ స్టేషన్లో వసతులు కల్పించడం, స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్లో భోజనం పెట్టించడం వంటి వ్యవహారాలపై విమర్శలు వచ్చాయి. ఇక పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ కు, ఆయన కోసం వచ్చిన బంధువులకు కుర్చీలు వేసి పోలీసులు మర్యాదలు చేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2024 4:36 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…