గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అంటూ భారీగా అక్రమాలు, దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి వల్ల రాష్ట్ర ఖజానాకి దాదాపు 160 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో, విచారణ జరిపిన అధికారులు వెంకట రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో, వెంకటరెడ్డిని సెప్టెంబరులో అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే, జైలులో వెంకటరెడ్డికి రాజభోగాలు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, బయటి భోజనం…ఇలా వెంకట రెడ్డిని జైల్లో సిబ్బంది కొత్త పెళ్లి కొడుకులా చూస్తున్నారట. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో జైలు సిబ్బందిపై ఆయన ఫైర్ అయ్యారట. జైల్లో వెంకట రెడ్డి వంటి వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారట. అంతేకాదు, వెంకట రెడ్డికి ఎవరు సహకరించారో పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారట.
అంతకుముందు కూడా వైసీపీ మాజీ నేత బోరుగడ్డ అనిల్ కు కూడా పోలీస్ స్టేషన్లో వసతులు కల్పించడం, స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్లో భోజనం పెట్టించడం వంటి వ్యవహారాలపై విమర్శలు వచ్చాయి. ఇక పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ కు, ఆయన కోసం వచ్చిన బంధువులకు కుర్చీలు వేసి పోలీసులు మర్యాదలు చేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2024 4:36 pm
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…