Political News

స‌త్తెన‌పల్లి ఎమ్మెల్యే ఎక్క‌డా…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న ఏరికోరి ఎంచుకున్న ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు అనేక అనేక సాహ‌సాలు చేసి.. అనేక మందిని త‌ప్పించి మ‌రీ ఇచ్చారు. ఆయ‌న కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆరు మాసాలైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పెద్ద‌గా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల్లో కూడా.. క‌న్నా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ లేరు. దీంతో త‌మ ఎమ్మెల్యే ఏరీ? అంటూ.. కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఎటు చూసినా.. మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మాటే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. విమ‌ర్శ అయినా.. ప్ర‌శంస అయినా..ఆయ‌నే మీడియా ముందుకు వ‌స్తున్నారు త‌ప్ప‌.. ఎమ్మ‌ల్యే మాట వినిపించ‌డం లేదు.

అయితే.. సొంత ప‌నుల‌పై విదేశాల‌కు వెళ్లార‌ని కొంద‌రు చెబుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌ని.. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే క‌న్నా క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో నెంబ‌ర్‌2 గా చ‌లామ‌ణి అయ్యే నాయ‌కుడి వ్య‌వ‌హారాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ‌సూళ్లు పెరిగిపోయాయ‌ని అంబ‌టి రాంబాబు విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

సాధార‌ణంగా ఎమ్మెల్యే అందుబాటులో లేక‌పోతే.. సంబంధిత నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. అయితే.. క‌న్నా ఎవ‌రికి అప్ప‌గించార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో నెంబ‌రు 2 గా చెప్పుకొనే నాయ‌కుడు మాత్రం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశం, వివాదాస్ప‌దం కూడా అవుతున్నారు. ఈ ప‌రిణామాతో విసిగిపోతున్న ప్ర‌జ‌లు త‌మ ఎమ్మెల్యే ఎక్క‌డంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులుపెడుతూ.. కామెంట్లు చేస్తున్నారు. మ‌రి క‌న్నా అనుచ‌ర‌గ‌ణం దీనిపై స్పందిస్తుందో లేదో చూడాలి.

This post was last modified on November 30, 2024 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

58 minutes ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

2 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

2 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

3 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

3 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

3 hours ago