కలియుగ ప్రత్యక్ష దైవరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కుటుంబసమేతంగా వెళుతుంటారు. ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకొని సాంత్వన పొందేందుకు అక్కడకు వెళతారు. ఈ క్రమంలోనే వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడే క్రమంలో కొందరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై ఇకపై రాజకీయాల గురించి మాట్లాడకూడదని కొద్ది రోజుల క్రితం సమావేశమైన టీటీడీ పాలక మండలి తీర్మానించింది.
ఈ క్రమంలోనే నేటి నుంచి ఆ నిబంధన అమల్లోకి రానుందని టీటీడీ తెలిపింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది.
మీడియాతో మాట్లాడే సందర్భాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల కంటే రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.తిరుమలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు రాజకీయ నాయకులు తిరుమల కొండ అని కూడా చూడకుండా రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో, ఈ నిబంధనను టీటీడీ ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. తమ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నిబంధనను భక్తులు, రాజకీయ నాయకులు అందరూ పాటించి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. తిరుమలలో నేటి నుంచి రాజకీయ వ్యాఖ్యలను నిషేధిస్తున్నామని సీపీఆర్వో టీటీడీ ఉత్తర్వులు జారీ చేశారు.
This post was last modified on November 30, 2024 1:55 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…