Political News

నేటి నుంచి తిరుమలలో నో పొలిటికల్ కామెంట్స్

కలియుగ ప్రత్యక్ష దైవరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కుటుంబసమేతంగా వెళుతుంటారు. ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకొని సాంత్వన పొందేందుకు అక్కడకు వెళతారు. ఈ క్రమంలోనే వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడే క్రమంలో కొందరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై ఇకపై రాజకీయాల గురించి మాట్లాడకూడదని కొద్ది రోజుల క్రితం సమావేశమైన టీటీడీ పాలక మండలి తీర్మానించింది.

ఈ క్రమంలోనే నేటి నుంచి ఆ నిబంధన అమల్లోకి రానుందని టీటీడీ తెలిపింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది.

మీడియాతో మాట్లాడే సందర్భాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల కంటే రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.తిరుమలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు రాజకీయ నాయకులు తిరుమల కొండ అని కూడా చూడకుండా రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో, ఈ నిబంధనను టీటీడీ ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. తమ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నిబంధనను భక్తులు, రాజకీయ నాయకులు అందరూ పాటించి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. తిరుమలలో నేటి నుంచి రాజకీయ వ్యాఖ్యలను నిషేధిస్తున్నామని సీపీఆర్వో టీటీడీ ఉత్తర్వులు జారీ చేశారు.

This post was last modified on November 30, 2024 1:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirumalaTTD

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

39 minutes ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

2 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

3 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

4 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

4 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

4 hours ago