Political News

నేటి నుంచి తిరుమలలో నో పొలిటికల్ కామెంట్స్

కలియుగ ప్రత్యక్ష దైవరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కుటుంబసమేతంగా వెళుతుంటారు. ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకొని సాంత్వన పొందేందుకు అక్కడకు వెళతారు. ఈ క్రమంలోనే వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడే క్రమంలో కొందరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై ఇకపై రాజకీయాల గురించి మాట్లాడకూడదని కొద్ది రోజుల క్రితం సమావేశమైన టీటీడీ పాలక మండలి తీర్మానించింది.

ఈ క్రమంలోనే నేటి నుంచి ఆ నిబంధన అమల్లోకి రానుందని టీటీడీ తెలిపింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది.

మీడియాతో మాట్లాడే సందర్భాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల కంటే రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.తిరుమలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు రాజకీయ నాయకులు తిరుమల కొండ అని కూడా చూడకుండా రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో, ఈ నిబంధనను టీటీడీ ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. తమ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నిబంధనను భక్తులు, రాజకీయ నాయకులు అందరూ పాటించి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. తిరుమలలో నేటి నుంచి రాజకీయ వ్యాఖ్యలను నిషేధిస్తున్నామని సీపీఆర్వో టీటీడీ ఉత్తర్వులు జారీ చేశారు.

This post was last modified on November 30, 2024 1:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirumalaTTD

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

46 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago