కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుస్తోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పోర్టు అధికారులకు, సిబ్బందికి బాధ్యత లేదని, జవాబుదారీ తనం లేదని, వారందరూ ఈ స్మగ్లింగ్ రాకెట్ కు బాధ్యులేనని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు తనను రానివ్వలేదని, రెండు నెలలుగా అడ్డుకుంటున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తనకే పోర్టు అధికారులు సహకరించలేదని, మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే కొండబాబుల పరిస్థితి ఏంటని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో కిలో రేషన్ బియ్యాన్ని 73 రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఈ ధందా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పారు. ఇంటర్నేషనల్ అయినా తాను లెక్క చేయబోనని, ఆ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ అంటున్న వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళుతూ పోర్ట్ అధికారులను పవన్ హెచ్చరిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.
This post was last modified on November 29, 2024 5:55 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…