కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుస్తోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పోర్టు అధికారులకు, సిబ్బందికి బాధ్యత లేదని, జవాబుదారీ తనం లేదని, వారందరూ ఈ స్మగ్లింగ్ రాకెట్ కు బాధ్యులేనని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు తనను రానివ్వలేదని, రెండు నెలలుగా అడ్డుకుంటున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తనకే పోర్టు అధికారులు సహకరించలేదని, మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే కొండబాబుల పరిస్థితి ఏంటని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో కిలో రేషన్ బియ్యాన్ని 73 రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఈ ధందా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పారు. ఇంటర్నేషనల్ అయినా తాను లెక్క చేయబోనని, ఆ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ అంటున్న వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళుతూ పోర్ట్ అధికారులను పవన్ హెచ్చరిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.
This post was last modified on November 29, 2024 5:55 pm
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…