కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుస్తోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పోర్టు అధికారులకు, సిబ్బందికి బాధ్యత లేదని, జవాబుదారీ తనం లేదని, వారందరూ ఈ స్మగ్లింగ్ రాకెట్ కు బాధ్యులేనని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు తనను రానివ్వలేదని, రెండు నెలలుగా అడ్డుకుంటున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తనకే పోర్టు అధికారులు సహకరించలేదని, మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే కొండబాబుల పరిస్థితి ఏంటని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో కిలో రేషన్ బియ్యాన్ని 73 రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఈ ధందా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పారు. ఇంటర్నేషనల్ అయినా తాను లెక్క చేయబోనని, ఆ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ అంటున్న వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళుతూ పోర్ట్ అధికారులను పవన్ హెచ్చరిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.
This post was last modified on November 29, 2024 5:55 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…