Political News

కాకినాడ పోర్టు: డిప్యూటీ సిఎం ని, నన్నే ఆపుతారా..?

కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణా నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రో్జు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు ఇక్కడకు రావని గ్యారెంటీ ఏంటని పవన్ ప్రశ్నించారు.
కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం కాకినాడ తీర ప్రాంతానికి లేదా అని సీరియస్ అయ్యారు. కాకినాడు పోర్టులో తనను పర్యటించనీయకుండా 2 నెలల నుంచి అడ్డుకుంటున్నారని, ఇక్కడ మాఫియా ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఉగ్రవాదులు ముంబై వంటి పెద్ద నగరాల నుంచే దేశంలోకి ప్రవేశించడం లేదని, కాకినాడ వంటి చిన్న తీర ప్రాంతాలలో కూడా చొరబడే అవకాశముందని అన్నారు. చిన్న 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్చేస్తే దిక్కులేదు…25వేల టన్నుల హెరాయిన్ విశాఖలో దొరికింది. ఇలాగే వదిలేస్తే కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ బియ్యం రవాణా, నిఘా వైఫల్యంపై జిల్లా ఎస్పీ వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తనను రెండు నెలలుగా కాకినాడ పోర్టును సందర్శించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్, ఆయుధాలు వెళ్లలేదని, వెళ్లబోవని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నించారు. అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం పూర్తి విఫలమైందని మండిపడ్డారు. దేశ భద్రతకు భంగం కలుగుతోందని తాను భావిస్తున్నానని, అక్రమ రవాణా చేస్తున్న బోట్ ఓనర్లు, దాని వెనుక ఉన్న వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిస్టర్ వంగలపూడి అనిత, కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించేందుకు, కాకినాడ పోర్టు అక్రమ రవాణా కార్యకలాపాలపై లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శికి పవన్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన అధికార యంత్రాంగంలో కూడా ప్రక్షాళన జరగాలని అన్నారు. కాకినాడ పోర్టుపై తాను ఫోకస్ చేస్తానని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆల్రెడీ ఈ విషయం గురించి చెప్పానని, మరోసారి కలిసి పూర్తిగా ఇక్కడ జరిగే విషయాలు వివరిస్తానని చెప్పారు.

This post was last modified on November 29, 2024 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

51 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago