అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత, కేటీఆర్ లపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు…కొండా సురేఖకు షాకిచ్చింది. ఈ కేసులో కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
దాంతోపాటు ఈ కేసు విచారణను డిసెంబర్ 12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అంతేకాదు, డిసెంబర్ 12న జరిగే విచారణకు సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని, పరువుప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు. నాగార్జున పిటిషన్ ను కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న కోర్టు..సురేఖకు సమన్లు జారీ చేసింది.
సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఆ తరహా వ్యాఖ్యలు చేసిన సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హులని వాదించారు. అయితే, సురేఖ తన వ్యాఖ్యలపై ఎక్స్ లో క్షమాపణలు చెప్పారని ఆమె తరఫు న్యాయవాది గురు ప్రీత్ సింగ్ వాదనలు వినిపించారు.
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో…
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు…
మొన్న ఏడాది దీపావళి పండక్కు విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమా అమరన్ తెలుగులోనూ మంచి విజయం…