ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. రఘురామ కోరుకున్న విధంగా నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ, గత వారం పదిరోజుల చరిత్రను గమనిస్తే.. రఘురామ కోరుకుంటున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కోరుకున్నట్టే జరుగుతున్నాయి.
1) పదవి పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు రఘురామ. నిజానికి ఎన్నికలకు ముందు అసలు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందేహం నుంచి టికెట్ దక్కేవరకు టెన్షన్ టెన్షన్. చివరకు టికెట్ దక్కింది. అయితే.. ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? ఐదేళ్లపాటు వైసీపీని ఏకేశాను.. టీడీపీకి దన్నుగా మారానంటూ.. రఘురామ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్వంటి కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయనకుదక్కలేదు. ఇక, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. దీంతో హ్యాపీ.
2)2022లో తనను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని.. కొట్టారని ఆరోపిస్తూ.. రఘురామ అప్పట్లోనే న్యాయ పోరాటం చేశారు. అయితే.. దీనిని అప్పట్లో సీరియస్గా తీసుకోలేదు. కానీ, నెల రోజుల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ చేసిన ఫిర్యాదు, తదనంతరం జరిగిన మార్పులతో ఇప్పుడు రఘురామకు ఆనందం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. ఈ కేసులో తనను కొట్టారని ఆరోపిస్తున్న మాజీ ఏ ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
3)తాను డిప్యూటీ స్పీకర్ అయినా.. ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. కేంద్రంలోని పెద్దలతో సంబంధాలను కొనసాగించాలన్నది రఘురామ ఆలోచన. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంతో తరచుగా సత్సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రఘురామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దుపై తాను దాఖలు చేసిన పిటిషన్గురించి ఆయనకు వివరించినట్టు సమాచారం. మొత్తంగా.. రఘురామ హ్యాపీ.. ఉండి టాక్ ఇదే!
This post was last modified on November 28, 2024 5:21 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…