ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. రఘురామ కోరుకున్న విధంగా నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ, గత వారం పదిరోజుల చరిత్రను గమనిస్తే.. రఘురామ కోరుకుంటున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కోరుకున్నట్టే జరుగుతున్నాయి.
1) పదవి పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు రఘురామ. నిజానికి ఎన్నికలకు ముందు అసలు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందేహం నుంచి టికెట్ దక్కేవరకు టెన్షన్ టెన్షన్. చివరకు టికెట్ దక్కింది. అయితే.. ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? ఐదేళ్లపాటు వైసీపీని ఏకేశాను.. టీడీపీకి దన్నుగా మారానంటూ.. రఘురామ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్వంటి కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయనకుదక్కలేదు. ఇక, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. దీంతో హ్యాపీ.
2)2022లో తనను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని.. కొట్టారని ఆరోపిస్తూ.. రఘురామ అప్పట్లోనే న్యాయ పోరాటం చేశారు. అయితే.. దీనిని అప్పట్లో సీరియస్గా తీసుకోలేదు. కానీ, నెల రోజుల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ చేసిన ఫిర్యాదు, తదనంతరం జరిగిన మార్పులతో ఇప్పుడు రఘురామకు ఆనందం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. ఈ కేసులో తనను కొట్టారని ఆరోపిస్తున్న మాజీ ఏ ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
3)తాను డిప్యూటీ స్పీకర్ అయినా.. ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. కేంద్రంలోని పెద్దలతో సంబంధాలను కొనసాగించాలన్నది రఘురామ ఆలోచన. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంతో తరచుగా సత్సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రఘురామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దుపై తాను దాఖలు చేసిన పిటిషన్గురించి ఆయనకు వివరించినట్టు సమాచారం. మొత్తంగా.. రఘురామ హ్యాపీ.. ఉండి టాక్ ఇదే!
This post was last modified on November 28, 2024 5:21 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…