ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. రఘురామ కోరుకున్న విధంగా నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ, గత వారం పదిరోజుల చరిత్రను గమనిస్తే.. రఘురామ కోరుకుంటున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కోరుకున్నట్టే జరుగుతున్నాయి.
1) పదవి పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు రఘురామ. నిజానికి ఎన్నికలకు ముందు అసలు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందేహం నుంచి టికెట్ దక్కేవరకు టెన్షన్ టెన్షన్. చివరకు టికెట్ దక్కింది. అయితే.. ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? ఐదేళ్లపాటు వైసీపీని ఏకేశాను.. టీడీపీకి దన్నుగా మారానంటూ.. రఘురామ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్వంటి కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయనకుదక్కలేదు. ఇక, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. దీంతో హ్యాపీ.
2)2022లో తనను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని.. కొట్టారని ఆరోపిస్తూ.. రఘురామ అప్పట్లోనే న్యాయ పోరాటం చేశారు. అయితే.. దీనిని అప్పట్లో సీరియస్గా తీసుకోలేదు. కానీ, నెల రోజుల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ చేసిన ఫిర్యాదు, తదనంతరం జరిగిన మార్పులతో ఇప్పుడు రఘురామకు ఆనందం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. ఈ కేసులో తనను కొట్టారని ఆరోపిస్తున్న మాజీ ఏ ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
3)తాను డిప్యూటీ స్పీకర్ అయినా.. ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. కేంద్రంలోని పెద్దలతో సంబంధాలను కొనసాగించాలన్నది రఘురామ ఆలోచన. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంతో తరచుగా సత్సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రఘురామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దుపై తాను దాఖలు చేసిన పిటిషన్గురించి ఆయనకు వివరించినట్టు సమాచారం. మొత్తంగా.. రఘురామ హ్యాపీ.. ఉండి టాక్ ఇదే!
This post was last modified on November 28, 2024 5:21 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…