ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. రఘురామ కోరుకున్న విధంగా నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ, గత వారం పదిరోజుల చరిత్రను గమనిస్తే.. రఘురామ కోరుకుంటున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కోరుకున్నట్టే జరుగుతున్నాయి.
1) పదవి పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు రఘురామ. నిజానికి ఎన్నికలకు ముందు అసలు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందేహం నుంచి టికెట్ దక్కేవరకు టెన్షన్ టెన్షన్. చివరకు టికెట్ దక్కింది. అయితే.. ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? ఐదేళ్లపాటు వైసీపీని ఏకేశాను.. టీడీపీకి దన్నుగా మారానంటూ.. రఘురామ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్వంటి కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయనకుదక్కలేదు. ఇక, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. దీంతో హ్యాపీ.
2)2022లో తనను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని.. కొట్టారని ఆరోపిస్తూ.. రఘురామ అప్పట్లోనే న్యాయ పోరాటం చేశారు. అయితే.. దీనిని అప్పట్లో సీరియస్గా తీసుకోలేదు. కానీ, నెల రోజుల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ చేసిన ఫిర్యాదు, తదనంతరం జరిగిన మార్పులతో ఇప్పుడు రఘురామకు ఆనందం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. ఈ కేసులో తనను కొట్టారని ఆరోపిస్తున్న మాజీ ఏ ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
3)తాను డిప్యూటీ స్పీకర్ అయినా.. ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. కేంద్రంలోని పెద్దలతో సంబంధాలను కొనసాగించాలన్నది రఘురామ ఆలోచన. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంతో తరచుగా సత్సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రఘురామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దుపై తాను దాఖలు చేసిన పిటిషన్గురించి ఆయనకు వివరించినట్టు సమాచారం. మొత్తంగా.. రఘురామ హ్యాపీ.. ఉండి టాక్ ఇదే!
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…