ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. రఘురామ కోరుకున్న విధంగా నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ, గత వారం పదిరోజుల చరిత్రను గమనిస్తే.. రఘురామ కోరుకుంటున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కోరుకున్నట్టే జరుగుతున్నాయి.
1) పదవి పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు రఘురామ. నిజానికి ఎన్నికలకు ముందు అసలు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందేహం నుంచి టికెట్ దక్కేవరకు టెన్షన్ టెన్షన్. చివరకు టికెట్ దక్కింది. అయితే.. ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? ఐదేళ్లపాటు వైసీపీని ఏకేశాను.. టీడీపీకి దన్నుగా మారానంటూ.. రఘురామ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్వంటి కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయనకుదక్కలేదు. ఇక, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. దీంతో హ్యాపీ.
2)2022లో తనను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారని.. కొట్టారని ఆరోపిస్తూ.. రఘురామ అప్పట్లోనే న్యాయ పోరాటం చేశారు. అయితే.. దీనిని అప్పట్లో సీరియస్గా తీసుకోలేదు. కానీ, నెల రోజుల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ చేసిన ఫిర్యాదు, తదనంతరం జరిగిన మార్పులతో ఇప్పుడు రఘురామకు ఆనందం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. ఈ కేసులో తనను కొట్టారని ఆరోపిస్తున్న మాజీ ఏ ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
3)తాను డిప్యూటీ స్పీకర్ అయినా.. ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. కేంద్రంలోని పెద్దలతో సంబంధాలను కొనసాగించాలన్నది రఘురామ ఆలోచన. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంతో తరచుగా సత్సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రఘురామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దుపై తాను దాఖలు చేసిన పిటిషన్గురించి ఆయనకు వివరించినట్టు సమాచారం. మొత్తంగా.. రఘురామ హ్యాపీ.. ఉండి టాక్ ఇదే!
This post was last modified on November 28, 2024 5:21 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…