వైసీపీ హయాంలో పోలవరం పనులు నత్తనడకన సాగిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. నీటిపారుదల శాఖకు జగన్ హయాంలో ఇద్దరు మంత్రులుగా పనిచేసినా ఉపయోగం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలతో బిజీగా ఉన్న అనిల్, అంబటి..పోలవరంపై ఫోకస్ చేయలేదని ట్రోలింగ్ జరిగింది. అసలు పోలవరం పనుల పురోగతి ఏమిటి అన్న విషయాలు కూడా జనానికి తెలియనివ్వలేదు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు మాత్రం అందుకు భిన్నంగా పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పోలవరం పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నిమ్మల…సీఎం చంద్రబాబు చెప్పినట్లు 2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్సైటును ప్రారంభించాలని అధికారులను నిమ్మల ఆదేశించారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు పోలవరం పనుల పురోగతిని ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై, ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో నిమ్మల భేటీ అయ్యారు. డిసెంబరు మొదటివారంలో పోలవరంలో చంద్రబాబు పర్యటించబోతున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల షెడ్యూలుపై అధికారులతో నిమ్మల సమీక్ష జరిపారు.
పోలవరంతో పాటు హంద్రీ-నీవా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాజెక్టుల పనులపై కూడా నిమ్మల చర్చించారు. ఆర్దిక ఇబ్బందులను అధిగమించి వాటిని త్వరితగతిన పూర్తి చెయడంపై దృష్టిసారించాలని అన్నారు. డిసెంబరు 8న జరగబోతున్న సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్స్ వంటి పనులలో రైతుల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు.
This post was last modified on November 28, 2024 2:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…