వైసీపీ హయాంలో పోలవరం పనులు నత్తనడకన సాగిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. నీటిపారుదల శాఖకు జగన్ హయాంలో ఇద్దరు మంత్రులుగా పనిచేసినా ఉపయోగం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలతో బిజీగా ఉన్న అనిల్, అంబటి..పోలవరంపై ఫోకస్ చేయలేదని ట్రోలింగ్ జరిగింది. అసలు పోలవరం పనుల పురోగతి ఏమిటి అన్న విషయాలు కూడా జనానికి తెలియనివ్వలేదు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు మాత్రం అందుకు భిన్నంగా పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పోలవరం పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నిమ్మల…సీఎం చంద్రబాబు చెప్పినట్లు 2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్సైటును ప్రారంభించాలని అధికారులను నిమ్మల ఆదేశించారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు పోలవరం పనుల పురోగతిని ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై, ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో నిమ్మల భేటీ అయ్యారు. డిసెంబరు మొదటివారంలో పోలవరంలో చంద్రబాబు పర్యటించబోతున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల షెడ్యూలుపై అధికారులతో నిమ్మల సమీక్ష జరిపారు.
పోలవరంతో పాటు హంద్రీ-నీవా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాజెక్టుల పనులపై కూడా నిమ్మల చర్చించారు. ఆర్దిక ఇబ్బందులను అధిగమించి వాటిని త్వరితగతిన పూర్తి చెయడంపై దృష్టిసారించాలని అన్నారు. డిసెంబరు 8న జరగబోతున్న సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్స్ వంటి పనులలో రైతుల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు.
This post was last modified on November 28, 2024 2:24 pm
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…