అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. భవిష్యత్తు అంతా డ్రోన్ టెక్నాలజీదేనని, డ్రోన్లను ఉపయోగించి ఇన్విజిబుల్ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ఆట కట్టించవచ్చని సీఎం చంద్రబాబు ఆ సమ్మిట్ లో చెప్పారు. అయితే, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా అనుకుంటున్న వారికి అది సాధ్యమే అని ఏపీ పోలీసులు నిరూపిస్తున్నారు.
ఇటీవల డ్రోన్లను ఉపయోగించి వందల ఎకరాల గంజాయి పంటను పోలీసులు దగ్ధం చేసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా అనంతపురం జిల్లాలో డ్రోన్లను ఉపయోగించి మందుబాబుల ఆటకట్టించారు పోలీసులు. పట్టపగలే బహిరంగ ప్రదేశాలలో మందేస్తున్న కొందరిని డ్రోన్లు కనిపెట్టాయి. ఇంకేముందు పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి పారిపోయారు. పొలాలలో, కాలువ గట్ల మీద, రైల్వే ట్రాక్ ల సమీపంలో మందుబాబులను డ్రోన్లు పరిగెత్తించాయి.
మందుబాబుల సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా కాకుండా డ్రోన్ల సాయంతో రంగంలోకి దిగారు. దీంతో, తమ ముఖం కనిపించకుండా తలా ఓ దిక్కుకు మందుబాబులు పరుగందుకున్నారు. కొందరు మందుబాబులు దొరకడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, డ్రోన్ల చేతికి చిక్కితే అంతే సంగతి అని పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం మందుబాబులు లబోదిబోమని పరిగెతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…