రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న కీలక అంశం. దీనికి కారణం.. ఎంతో కష్టపడినా కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి నామ మాత్రపు సీట్లు కూడా దక్కలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడింది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్లింది. అయినప్పటికీ..పార్టీ నాశిరకమైన పరిస్థితిలోనే ఉంది.
దీంతో పోల్చుకుంటే ఏపీలో 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు పార్టీని అడుగులు వేయించేలా పరుగులు పెట్టించాలంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని నాయకులు చెబుతున్నా రు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ పోగొట్టుకున్న ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అదేసమయంలో పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులను అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
కానీ, ప్రస్తుతం పార్టీ చీఫ్గా ఉన్న షర్మిల ఆదిశగా అడుగులు వేయడం లేదనేది సీనియర్లు చెబుతున్న మాట. అంతేకాదు.. సొంత అజెండాను ఆమె వదులు కోలేక పోతున్నారని, పార్టీని డెవలప్ చేసేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అయినా.. ప్రజలకు చేరువ కావడంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా తర్జన భర్జన పడుతోందని రఘువీరా రెడ్డి వంటివారు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.
వీటిని అనుకూల మీడియా ప్రస్తావించకపోయినా.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా షర్మిల తన సొంత అజెండాను పక్కన పెట్టి.. అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి ఉండాలని చెబుతున్నారు. ఆ దిశగా అడగులు వేయకపోతే.. మరింత దారుణ పరిస్థితికి కాంగ్రెస్ చేరిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. “మహారాష్ట్ర ఫలితం చూసిన తర్వాత.. ఇక్కడ చాలా మార్పు రావాల్సిన అసవరం ఉంది. మరి ఏంచేస్తారో” అని రఘువీరా చేసిన కామెంట్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
This post was last modified on November 27, 2024 11:30 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…