Political News

ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌.. బాబు క‌రుణిస్తారా..!

ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు ప‌ద‌వుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే టికెట్లు ద‌క్క‌క ఉసూరు మంటున్న వీరు.. ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వులు సైతం ద‌క్క‌క అల్లాడిపోతున్నారు. అంతేకాదు.. వారికంటే వెనుకాల పార్టీలో చేరిన వారికి ప‌ద‌వులు ద‌క్కుతుండ‌డం.. తామేమో మౌనంగా ఉన్న నేప‌థ్యంలో ప‌ద‌వుల ప‌రిస్థితి వీరికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇప్పుడు ఏంచేయాల‌న్న దానిపై అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు.

వారే .. ఒక‌రు పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ నాయ‌కురాలు గిడ్డి ఈశ్వ‌రి, మ‌రొక‌రు మాజీ మంత్రి, ఎస్టీ నాయకురాలు మ‌త్య్స‌రాస మ‌ణికుమారి. గిడ్డి ఈశ్వ‌రి వాస్త‌వానికి వైసీపీతో రాజ‌కీయాలు ప్రారంభించారు. 2014 లో పాడేరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. ఆమె మంత్రి అయ్యే వార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ప‌ద‌వి ఖాయం అనుకున్నారు. కానీ, తాను చేసుకున్న కామెంట్లే.. ఈ ప‌ద‌విని దూరం చేశాయి.

ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా ద‌క్క‌లేదు. దీంతో ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వి కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. పొరుగున ఉన్న అర‌కులో చాలా మందికి ప‌ద‌వులు ద‌క్క‌డం.. త‌న‌కు ద‌క్క‌క పోవ‌డంతో గిడ్డి ఈశ్వ‌రిపై ఒత్తిడి ఎక్కువ‌గానేఉంది. త‌ర‌చుగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, టీడీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ద్వారా ఈశ్వ‌రి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు నామినేటెడ్ ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, రాలేదు.

ఇక‌, మాజీ మంత్రి మ‌త్య్స‌రాస మ‌ణికుమారి.. కూడా వెయిటింగ్‌లోనే ఉన్నారు. ప్ర‌త్య‌క్ష్ రాజ‌కీయాల‌కు దాదాపు దూరంగా ఉన్న మ‌ణికుమారి.. ఇప్పుడు ప‌ద‌వి ఇస్తే.. చాల‌ని, ఇక‌, రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతాన‌ని అంటున్నారు. రెండు రోజుల కింద‌ట మంత్రినారాలోకేస్‌తోనూ ఆమె భేటీ అయ్యారు. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పారు. దీనికి చూద్దా.. చేద్దాం అంటూ మంత్రి చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఇదే త‌న చివ‌రి కోరిక అని.. ఏదో ఒక ప‌ద‌విని ఇవ్వాల‌ని కూడా ఆమె కోర‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోకూట‌మి ప్ర‌భుత్వం, పార్టీలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయో చూడాలి.

This post was last modified on November 27, 2024 11:28 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 minute ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

51 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

56 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago