Political News

ఢిల్లీ టూర్‌లో ప‌వ‌న్‌… కేంద్రమంత్రులతో భేటీ!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఏపీకి సంబంధించిన ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అద‌న‌పు కేటాయింపుల‌పై ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీజేపీ పెద్ద‌ల‌ను కూడా క‌లుసుకో నున్నారు. అయితే, దీనిలో ఒక‌టి అధికారిక ప‌ర్య‌ట‌న‌కాగా.. మరొక‌టి ప్రైవేటు ప‌ర్య‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. అధికారికంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయిన ప‌వ‌న్‌.. రాష్ట్ర ప‌ర్యాట‌క రంగంపై చ‌ర్చించారు.

అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి 7 కీల‌క అంశాలు ఉన్నాయ‌ని, వాటిని డెవ‌ల‌ప్ చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో నిధుల కేటాయింపు, ప్రోత్సాహ కం వంటి విష‌యాల‌పై మాట్లాడిన‌ట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఏపీకి 975 కిలో మీట‌ర్ల మేర కోస్ట‌ల్ ప్రాంతం ఉంద‌ని, దీనిని డెవ‌ల‌ప్ చేసుకుంటే ప‌ర్యాట‌క ప‌రంగా రాష్ట్రానికి ఆదాయం వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు.

నిధులు కూడా కేటాయించాల‌ని కోరిన‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఇదిలావుంటే, ప్రైవేటు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్‌.. బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుసుకుంటార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ఎన్ని క‌ల్లో ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌డం, ఆయ‌న ప్ర‌సంగించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్న నేప‌థ్యంలో జాతీయ నాయ‌కులు ప‌వ‌న్‌ను అభినందించ‌నున్నారు. ఇదేస‌మ‌యంలో అదానీ-జ‌గ‌న్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆ వ్య‌వ‌హారంలో ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న వారు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై కూడా బీజేపీ పెద్ద‌లు దిశానిర్దేశం చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో త‌ట‌స్థ మీడియాలో అదానీని వ‌దిలేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్డీయే ప‌క్షాలు అదానీ లంచాల కేసుల‌పై ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న దానిపై ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు ఒక రూట్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నారు. దానిప్ర‌కార‌మే మాట్లాడాల‌ని అధికార ప్ర‌తినిధులను కూడా ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 26, 2024 2:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

15 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

46 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago