ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏపీకి సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను ఆయన కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదనపు కేటాయింపులపై ఆయన చర్చించినట్టు చెప్పారు. పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కూడా కలుసుకో నున్నారు. అయితే, దీనిలో ఒకటి అధికారిక పర్యటనకాగా.. మరొకటి ప్రైవేటు పర్యటన కావడం గమనార్హం. అధికారికంగా గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిన పవన్.. రాష్ట్ర పర్యాటక రంగంపై చర్చించారు.
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించి 7 కీలక అంశాలు ఉన్నాయని, వాటిని డెవలప్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో నిధుల కేటాయింపు, ప్రోత్సాహ కం వంటి విషయాలపై మాట్లాడినట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఏపీకి 975 కిలో మీటర్ల మేర కోస్టల్ ప్రాంతం ఉందని, దీనిని డెవలప్ చేసుకుంటే పర్యాటక పరంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
నిధులు కూడా కేటాయించాలని కోరినట్టు పవన్ చెప్పారు. ఇదిలావుంటే, ప్రైవేటు పర్యటనలో భాగంగా పవన్.. బీజేపీ పెద్దలను కలుసుకుంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్ని కల్లో పవన్ ప్రచారం చేయడం, ఆయన ప్రసంగించిన నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి పార్టీలు విజయం దక్కించుకున్న నేపథ్యంలో జాతీయ నాయకులు పవన్ను అభినందించనున్నారు. ఇదేసమయంలో అదానీ-జగన్ వ్యవహారం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఆ వ్యవహారంలో ఎన్డీయే మిత్రపక్షాలుగా ఉన్న వారు ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా బీజేపీ పెద్దలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తటస్థ మీడియాలో అదానీని వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయే పక్షాలు అదానీ లంచాల కేసులపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే బీజేపీ నేతలు ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసుకున్నారు. దానిప్రకారమే మాట్లాడాలని అధికార ప్రతినిధులను కూడా ఆదేశించడం గమనార్హం.
This post was last modified on November 26, 2024 2:47 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…