Political News

ఢిల్లీ టూర్‌లో ప‌వ‌న్‌… కేంద్రమంత్రులతో భేటీ!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఏపీకి సంబంధించిన ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అద‌న‌పు కేటాయింపుల‌పై ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీజేపీ పెద్ద‌ల‌ను కూడా క‌లుసుకో నున్నారు. అయితే, దీనిలో ఒక‌టి అధికారిక ప‌ర్య‌ట‌న‌కాగా.. మరొక‌టి ప్రైవేటు ప‌ర్య‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. అధికారికంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయిన ప‌వ‌న్‌.. రాష్ట్ర ప‌ర్యాట‌క రంగంపై చ‌ర్చించారు.

అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి 7 కీల‌క అంశాలు ఉన్నాయ‌ని, వాటిని డెవ‌ల‌ప్ చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో నిధుల కేటాయింపు, ప్రోత్సాహ కం వంటి విష‌యాల‌పై మాట్లాడిన‌ట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఏపీకి 975 కిలో మీట‌ర్ల మేర కోస్ట‌ల్ ప్రాంతం ఉంద‌ని, దీనిని డెవ‌ల‌ప్ చేసుకుంటే ప‌ర్యాట‌క ప‌రంగా రాష్ట్రానికి ఆదాయం వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు.

నిధులు కూడా కేటాయించాల‌ని కోరిన‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఇదిలావుంటే, ప్రైవేటు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్‌.. బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుసుకుంటార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ఎన్ని క‌ల్లో ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌డం, ఆయ‌న ప్ర‌సంగించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్న నేప‌థ్యంలో జాతీయ నాయ‌కులు ప‌వ‌న్‌ను అభినందించ‌నున్నారు. ఇదేస‌మ‌యంలో అదానీ-జ‌గ‌న్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆ వ్య‌వ‌హారంలో ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న వారు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై కూడా బీజేపీ పెద్ద‌లు దిశానిర్దేశం చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో త‌ట‌స్థ మీడియాలో అదానీని వ‌దిలేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్డీయే ప‌క్షాలు అదానీ లంచాల కేసుల‌పై ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న దానిపై ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు ఒక రూట్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నారు. దానిప్ర‌కార‌మే మాట్లాడాల‌ని అధికార ప్ర‌తినిధులను కూడా ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 26, 2024 2:47 pm

Share

Recent Posts

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా…

20 minutes ago

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…

33 minutes ago

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

2 hours ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

5 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

9 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

12 hours ago