రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మాజీ సీఎం జగన్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ చివరకు ఒక్క రాజధాని కూడా లేకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ ఘోరంగా దెబ్బతీశారని విమర్శలు వచ్చాయి. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుబెట్టిందని మంత్రి నారాయణ అన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని నారాయణ చెప్పారు. 5 ఐకానిక్ టవర్లకు సంబంధించి డిజైన్ కాంట్రాక్ట్ నారిమన్ ఫాస్టర్ కంపెనీకి ఇచ్చామని అన్నారు. రాజధాని అమరావతిపై సీఆర్డీఏ అథారిటీ అధికారులతో నారాయణ సమీక్ష జరిపారు. అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారని, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ తెస్తామని నారాయణ చెప్పారు.
5 ఐకానిక్ భవనాల డిజైన్ కాంట్రాక్టును నారిమన్ ఫాస్టర్ కంపెనీ దక్కించుందని అన్నారు. దానిని ఈ రోజు సీఆర్డీఏ అథారిటీ ముందు పెట్టి అప్రూవల్ చేశామని అన్నారు. దీంతోపాటు ఏ టెండర్ వచ్చినా సీఆర్డీఏ అథారిటీ అప్రూవ్ చేయాల్సిందేనని అన్నారు. అంతకుముందు చేసిన డిజైన్ అసంపూర్తిగా ఉందని, ఆ డిజైన్ ను గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని అన్నారు. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి డిజైన్ కోసం టెండర్లు పిలిచామని అన్నారు. రాజధాని అమరావతి అని పార్లమెంటులో ఆల్రెడీ కేంద్రం చెప్పిందని, దానికి అఫీషియల్ గా గెజిట్ కావాలంటే తెప్పిస్తామని నారాయణ చెప్పారు.
This post was last modified on November 26, 2024 1:45 pm
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…