రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మాజీ సీఎం జగన్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ చివరకు ఒక్క రాజధాని కూడా లేకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ ఘోరంగా దెబ్బతీశారని విమర్శలు వచ్చాయి. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుబెట్టిందని మంత్రి నారాయణ అన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని నారాయణ చెప్పారు. 5 ఐకానిక్ టవర్లకు సంబంధించి డిజైన్ కాంట్రాక్ట్ నారిమన్ ఫాస్టర్ కంపెనీకి ఇచ్చామని అన్నారు. రాజధాని అమరావతిపై సీఆర్డీఏ అథారిటీ అధికారులతో నారాయణ సమీక్ష జరిపారు. అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారని, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ తెస్తామని నారాయణ చెప్పారు.
5 ఐకానిక్ భవనాల డిజైన్ కాంట్రాక్టును నారిమన్ ఫాస్టర్ కంపెనీ దక్కించుందని అన్నారు. దానిని ఈ రోజు సీఆర్డీఏ అథారిటీ ముందు పెట్టి అప్రూవల్ చేశామని అన్నారు. దీంతోపాటు ఏ టెండర్ వచ్చినా సీఆర్డీఏ అథారిటీ అప్రూవ్ చేయాల్సిందేనని అన్నారు. అంతకుముందు చేసిన డిజైన్ అసంపూర్తిగా ఉందని, ఆ డిజైన్ ను గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని అన్నారు. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి డిజైన్ కోసం టెండర్లు పిలిచామని అన్నారు. రాజధాని అమరావతి అని పార్లమెంటులో ఆల్రెడీ కేంద్రం చెప్పిందని, దానికి అఫీషియల్ గా గెజిట్ కావాలంటే తెప్పిస్తామని నారాయణ చెప్పారు.
This post was last modified on November 26, 2024 1:45 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…