Political News

ఈవీఎంలను మరోసారి టార్గెట్ చేసిన జగన్

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ ఈవీఎంలపై పరోక్షంగా కామెంట్లతో మొదలుపెట్టిన జగన్…ఆ తర్వాత నేరుగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కామెంట్లు చేయడం మొదలుబెట్టారు. ఆరు నెలలుగా ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ జగన్ ఒకే పాట పాడుతున్నారు. తాజాగా నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈవీఎంలు వద్దు…బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ మరోసారి జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలన్న జగన్…ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని చెప్పారు. అయితే, ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలు బ్యాలెట్‌ పేపర్ల వైపు మొగ్గు చూపాయని, మనం కూడా ఆ దిశగా అడుగులు ఎందుకు వేయకూడదు అని జగన్ ప్రశ్నించారు.

అయితే, ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, జరిగే అవకాశం కూడా లేదని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది. 2019లో భారీ మెజారిటీతో 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై జగన్ కు అనుమానాలు ఎందుకు రాలేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇకనైనా ఈవీఎంలపై ఏడుపు మానేసి తన పార్టీ నేతలకు విలువ, గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్న విషయంపై ఫోకస్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇకనైనా, నియంతృత్వ ధోరణిని వీడి బూత్ లెవల్ కార్యకర్తలను పట్టించుకోవడం వంటి విషయాలపై జగన్ ఫోకస్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీరించాలని, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాల్సింది పోయి ఇలా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐదేళ్లూ గడిపేస్తే రాబోయే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని సెటైర్లు వేస్తున్నారు.

Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

1 hour ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

5 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

11 hours ago