2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ ఈవీఎంలపై పరోక్షంగా కామెంట్లతో మొదలుపెట్టిన జగన్…ఆ తర్వాత నేరుగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కామెంట్లు చేయడం మొదలుబెట్టారు. ఆరు నెలలుగా ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ జగన్ ఒకే పాట పాడుతున్నారు. తాజాగా నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈవీఎంలు వద్దు…బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ మరోసారి జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలన్న జగన్…ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని చెప్పారు. అయితే, ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలు బ్యాలెట్ పేపర్ల వైపు మొగ్గు చూపాయని, మనం కూడా ఆ దిశగా అడుగులు ఎందుకు వేయకూడదు అని జగన్ ప్రశ్నించారు.
అయితే, ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, జరిగే అవకాశం కూడా లేదని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది. 2019లో భారీ మెజారిటీతో 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై జగన్ కు అనుమానాలు ఎందుకు రాలేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇకనైనా ఈవీఎంలపై ఏడుపు మానేసి తన పార్టీ నేతలకు విలువ, గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్న విషయంపై ఫోకస్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇకనైనా, నియంతృత్వ ధోరణిని వీడి బూత్ లెవల్ కార్యకర్తలను పట్టించుకోవడం వంటి విషయాలపై జగన్ ఫోకస్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీరించాలని, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాల్సింది పోయి ఇలా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐదేళ్లూ గడిపేస్తే రాబోయే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని సెటైర్లు వేస్తున్నారు.
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…