2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ ఈవీఎంలపై పరోక్షంగా కామెంట్లతో మొదలుపెట్టిన జగన్…ఆ తర్వాత నేరుగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కామెంట్లు చేయడం మొదలుబెట్టారు. ఆరు నెలలుగా ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ జగన్ ఒకే పాట పాడుతున్నారు. తాజాగా నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈవీఎంలు వద్దు…బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ మరోసారి జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలన్న జగన్…ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని చెప్పారు. అయితే, ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలు బ్యాలెట్ పేపర్ల వైపు మొగ్గు చూపాయని, మనం కూడా ఆ దిశగా అడుగులు ఎందుకు వేయకూడదు అని జగన్ ప్రశ్నించారు.
అయితే, ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, జరిగే అవకాశం కూడా లేదని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది. 2019లో భారీ మెజారిటీతో 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై జగన్ కు అనుమానాలు ఎందుకు రాలేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇకనైనా ఈవీఎంలపై ఏడుపు మానేసి తన పార్టీ నేతలకు విలువ, గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్న విషయంపై ఫోకస్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇకనైనా, నియంతృత్వ ధోరణిని వీడి బూత్ లెవల్ కార్యకర్తలను పట్టించుకోవడం వంటి విషయాలపై జగన్ ఫోకస్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీరించాలని, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాల్సింది పోయి ఇలా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐదేళ్లూ గడిపేస్తే రాబోయే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని సెటైర్లు వేస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…