టీడీపీ నాయకుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీరు మారలేదు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో చాలా మంది ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం, వీడియోలు తీయించుకోవడం.. చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక, మీడియా ముందు చేసే విన్యాసాలు కూడా అందరికీ తెలిసిందే. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం అవన్నీ.. మాయమై.. అసలు నాయకులు బయటకు వస్తారు. దీంతో నాయకులు చెప్పే నీతులు కేవలం కలరింగ్, కవరింగ్ కోసమేనన్న ప్రచారం ఉంది. అయితే.. కలిశెట్టి విషయంలో మాత్రం ఇది నిజం కాదని నిరూపితమైంది.
విజయనగరం పార్లమెంటుస్థానం నుంచి తొలిసారి విజయం అందుకున్న అప్పలనాయుడు.. ఈ ఏడాది పార్లమెంటు సమావేశాలకు తొలిసారి హాజరైనప్పుడు.. ప్రత్యేకంగా కనిపించారు. పూర్తిగా పార్టీ రంగైన పసుపు వస్త్రాలు ధరించి.. 6 కిలో మీటర్ల దూరం లోని ఇంటి నుంచి పార్లమెంటుకు సైకిల్(టీడీపీ ఎన్నికల గుర్తు)పై ఆయన సమావేశాలకు వచ్చారు. ఇది బాగానే ప్రచారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఆయనను మెచ్చుకున్నారు. అయితే..”ఫస్ట్ టైమ్ ఎంపీ కదా.. ఫస్ట్ ఫస్ట్ ఇలానే చేస్తారులే.. మీడియాలో కవరేజీ కోసం!” అన్న కామెంట్లు సొంత పార్టీలోనే వినిపించాయి.
అయితే.. కలిశెట్టి వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు కావడంతో ఆయా విమర్శలను ఆయన పట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు రెండోసారి సభలు ప్రారంభమయ్యాయి. సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కూడా అచ్చం కలిశెట్టి తొలి సభకు ఎలా అయితే హాజరయ్యారో.. అదే సంప్రదాయాన్ని పాటించారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆయన పార్టీ సింబలైన సైకిల్(దీనిని కూడా విజయనగరం నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి తీసుకువెళ్లారు)పై పార్లమెంటు వరకు తొక్కుకుంటూ వెళ్లారు. ఇదేదో మొహమాటం కోసమో.. కలరింగ్, కవరింగ్ కోసమో కాకుండా.. పూర్తిగా ఆయన సంతృప్తిగా సైకిల్ తొక్కుతూ.. ఎంతో ఆనందంగా పార్లమెంటుకు చేరుకోవడం కనిపించింది.
గతంలో కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్లేవారు. అలానే ఒడిసాకు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు ప్రస్తుతం సైకిల్పైనే వస్తున్నారు. మరికొందరు ఎంపీలు బ్యాటరీ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. ఇలా.. ఏపీకి చెందిన ఏకైక ఎంపీ కలిశెట్టి మాత్రమే సైకిల్ తొక్కుతూ.. పార్లమెంటుకురావడం గమనార్హం. దీనివెనుక రెండు కారణాలు ఉన్నాయని ఆయన చెబుతున్నా రు. 1) టీడీపీపై తనకున్న మమకారం. 2) ఢిల్లీలో ప్రస్తుతం పెరిగిపోయిన వాయుకాలుష్యాన్ని తనవంతుగా కొంతైనా తగ్గించడం.(అంటే కారును వాడకుండా ఉండడం).
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…