Political News

ఏపీకి చెందిన ఏకైక ఎంపీ క‌లిశెట్టి మాత్ర‌మే ఇలా సాధ్య‌మైంది!!

టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు తీరు మార‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో చాలా మంది ఫొటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం కోసం, వీడియోలు తీయించుకోవ‌డం.. చేసే ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక‌, మీడియా ముందు చేసే విన్యాసాలు కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ, వాస్త‌వంలోకి వ‌చ్చే స‌రికి మాత్రం అవ‌న్నీ.. మాయ‌మై.. అస‌లు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు. దీంతో నాయ‌కులు చెప్పే నీతులు కేవ‌లం క‌ల‌రింగ్‌, క‌వ‌రింగ్ కోస‌మేన‌న్న ప్ర‌చారం ఉంది. అయితే.. క‌లిశెట్టి విష‌యంలో మాత్రం ఇది నిజం కాద‌ని నిరూపిత‌మైంది.

విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటుస్థానం నుంచి తొలిసారి విజ‌యం అందుకున్న అప్ప‌ల‌నాయుడు.. ఈ ఏడాది పార్ల‌మెంటు స‌మావేశాల‌కు తొలిసారి హాజ‌రైన‌ప్పుడు.. ప్ర‌త్యేకంగా క‌నిపించారు. పూర్తిగా పార్టీ రంగైన ప‌సుపు వ‌స్త్రాలు ధ‌రించి.. 6 కిలో మీట‌ర్ల దూరం లోని ఇంటి నుంచి పార్ల‌మెంటుకు సైకిల్‌(టీడీపీ ఎన్నిక‌ల గుర్తు)పై ఆయ‌న స‌మావేశాల‌కు వ‌చ్చారు. ఇది బాగానే ప్ర‌చారంలోకి వ‌చ్చింది. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌ను మెచ్చుకున్నారు. అయితే..”ఫ‌స్ట్ టైమ్ ఎంపీ క‌దా.. ఫ‌స్ట్ ఫ‌స్ట్ ఇలానే చేస్తారులే.. మీడియాలో క‌వ‌రేజీ కోసం!” అన్న కామెంట్లు సొంత పార్టీలోనే వినిపించాయి.

అయితే.. క‌లిశెట్టి వివాదాల‌కు దూరంగా ఉండే నాయ‌కుడు కావ‌డంతో ఆయా విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు రెండోసారి స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. సోమ‌వారం శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మావేశాల‌కు కూడా అచ్చం క‌లిశెట్టి తొలి స‌భ‌కు ఎలా అయితే హాజ‌రయ్యారో.. అదే సంప్ర‌దాయాన్ని పాటించారు. ఢిల్లీలోని త‌న నివాసం నుంచి ఆయ‌న పార్టీ సింబ‌లైన సైకిల్‌(దీనిని కూడా విజ‌య‌న‌గ‌రం నుంచి ప్ర‌త్యేకంగా ఢిల్లీకి తీసుకువెళ్లారు)పై పార్ల‌మెంటు వ‌ర‌కు తొక్కుకుంటూ వెళ్లారు. ఇదేదో మొహ‌మాటం కోస‌మో.. క‌ల‌రింగ్, క‌వ‌రింగ్ కోస‌మో కాకుండా.. పూర్తిగా ఆయ‌న సంతృప్తిగా సైకిల్ తొక్కుతూ.. ఎంతో ఆనందంగా పార్ల‌మెంటుకు చేరుకోవ‌డం క‌నిపించింది.

గ‌తంలో క‌మ్యూనిస్టు యోధుడు పుచ్చ‌లప‌ల్లి సుంద‌ర‌య్య సైకిల్ పైనే పార్ల‌మెంటుకు వెళ్లేవారు. అలానే ఒడిసాకు చెందిన బీజేపీ ఎంపీ ఒక‌రు ప్ర‌స్తుతం సైకిల్‌పైనే వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు ఎంపీలు బ్యాట‌రీ ద్విచ‌క్ర వాహ‌నాలు వినియోగిస్తున్నారు. ఇలా.. ఏపీకి చెందిన ఏకైక ఎంపీ క‌లిశెట్టి మాత్ర‌మే సైకిల్ తొక్కుతూ.. పార్ల‌మెంటుకురావ‌డం గ‌మ‌నార్హం. దీనివెనుక రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెబుతున్నా రు. 1) టీడీపీపై త‌న‌కున్న మ‌మ‌కారం. 2) ఢిల్లీలో ప్ర‌స్తుతం పెరిగిపోయిన వాయుకాలుష్యాన్ని త‌న‌వంతుగా కొంతైనా త‌గ్గించ‌డం.(అంటే కారును వాడ‌కుండా ఉండ‌డం).

This post was last modified on November 26, 2024 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

1 hour ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

4 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

4 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

4 hours ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

6 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

8 hours ago