Political News

ఏపీకి చెందిన ఏకైక ఎంపీ క‌లిశెట్టి మాత్ర‌మే ఇలా సాధ్య‌మైంది!!

టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు తీరు మార‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో చాలా మంది ఫొటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం కోసం, వీడియోలు తీయించుకోవ‌డం.. చేసే ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక‌, మీడియా ముందు చేసే విన్యాసాలు కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ, వాస్త‌వంలోకి వ‌చ్చే స‌రికి మాత్రం అవ‌న్నీ.. మాయ‌మై.. అస‌లు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు. దీంతో నాయ‌కులు చెప్పే నీతులు కేవ‌లం క‌ల‌రింగ్‌, క‌వ‌రింగ్ కోస‌మేన‌న్న ప్ర‌చారం ఉంది. అయితే.. క‌లిశెట్టి విష‌యంలో మాత్రం ఇది నిజం కాద‌ని నిరూపిత‌మైంది.

విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటుస్థానం నుంచి తొలిసారి విజ‌యం అందుకున్న అప్ప‌ల‌నాయుడు.. ఈ ఏడాది పార్ల‌మెంటు స‌మావేశాల‌కు తొలిసారి హాజ‌రైన‌ప్పుడు.. ప్ర‌త్యేకంగా క‌నిపించారు. పూర్తిగా పార్టీ రంగైన ప‌సుపు వ‌స్త్రాలు ధ‌రించి.. 6 కిలో మీట‌ర్ల దూరం లోని ఇంటి నుంచి పార్ల‌మెంటుకు సైకిల్‌(టీడీపీ ఎన్నిక‌ల గుర్తు)పై ఆయ‌న స‌మావేశాల‌కు వ‌చ్చారు. ఇది బాగానే ప్ర‌చారంలోకి వ‌చ్చింది. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌ను మెచ్చుకున్నారు. అయితే..”ఫ‌స్ట్ టైమ్ ఎంపీ క‌దా.. ఫ‌స్ట్ ఫ‌స్ట్ ఇలానే చేస్తారులే.. మీడియాలో క‌వ‌రేజీ కోసం!” అన్న కామెంట్లు సొంత పార్టీలోనే వినిపించాయి.

అయితే.. క‌లిశెట్టి వివాదాల‌కు దూరంగా ఉండే నాయ‌కుడు కావ‌డంతో ఆయా విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు రెండోసారి స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. సోమ‌వారం శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మావేశాల‌కు కూడా అచ్చం క‌లిశెట్టి తొలి స‌భ‌కు ఎలా అయితే హాజ‌రయ్యారో.. అదే సంప్ర‌దాయాన్ని పాటించారు. ఢిల్లీలోని త‌న నివాసం నుంచి ఆయ‌న పార్టీ సింబ‌లైన సైకిల్‌(దీనిని కూడా విజ‌య‌న‌గ‌రం నుంచి ప్ర‌త్యేకంగా ఢిల్లీకి తీసుకువెళ్లారు)పై పార్ల‌మెంటు వ‌ర‌కు తొక్కుకుంటూ వెళ్లారు. ఇదేదో మొహ‌మాటం కోస‌మో.. క‌ల‌రింగ్, క‌వ‌రింగ్ కోస‌మో కాకుండా.. పూర్తిగా ఆయ‌న సంతృప్తిగా సైకిల్ తొక్కుతూ.. ఎంతో ఆనందంగా పార్ల‌మెంటుకు చేరుకోవ‌డం క‌నిపించింది.

గ‌తంలో క‌మ్యూనిస్టు యోధుడు పుచ్చ‌లప‌ల్లి సుంద‌ర‌య్య సైకిల్ పైనే పార్ల‌మెంటుకు వెళ్లేవారు. అలానే ఒడిసాకు చెందిన బీజేపీ ఎంపీ ఒక‌రు ప్ర‌స్తుతం సైకిల్‌పైనే వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు ఎంపీలు బ్యాట‌రీ ద్విచ‌క్ర వాహ‌నాలు వినియోగిస్తున్నారు. ఇలా.. ఏపీకి చెందిన ఏకైక ఎంపీ క‌లిశెట్టి మాత్ర‌మే సైకిల్ తొక్కుతూ.. పార్ల‌మెంటుకురావ‌డం గ‌మ‌నార్హం. దీనివెనుక రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెబుతున్నా రు. 1) టీడీపీపై త‌న‌కున్న మ‌మ‌కారం. 2) ఢిల్లీలో ప్ర‌స్తుతం పెరిగిపోయిన వాయుకాలుష్యాన్ని త‌న‌వంతుగా కొంతైనా త‌గ్గించ‌డం.(అంటే కారును వాడ‌కుండా ఉండ‌డం).

Satya

Recent Posts

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

26 minutes ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

56 minutes ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

3 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

3 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

5 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

6 hours ago