Political News

దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు ఎన్నంటే?

ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త ధోరణి కనిపిస్తోంది. ఎన్నికలు జరిగినప్పుడు అధికార.. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చే ఓట్లు.. సీట్ల లెక్కలో తేడాలు ఉండొచ్చు. కానీ.. అంతిమంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షాన్ని ప్రజలు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ తీరు మారుతోంది.

పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు రావాల్సిన ఓట్లు.. సీట్లు రాని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు అధికార కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే.. విపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కటం తెలిసిందే.దీంతో.. ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం సీట్లు లేకపోవటంతో.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు.. తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది.మహారాష్ట్రలో అధికార పక్షంగా మహాయుతి అవతరించగా.. ప్రతిపక్షంగా మహా వికాస్ అఘాడీ నిలిచింది. అయితే.. ఈ కూటమిలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా పది శాతం సీట్లు రాలేదు. కూటమిలోని శివసేన (యూబీటీ) 20 సీట్లు.. కాంగ్రెస్ కు 16, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలువచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పది శాతం సీట్లు అంటే.. 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ.. విపక్షంలో నిలిచిన ఏ పార్టీకి ఆ స్థాయిలో సీట్లు రాకపోవటంతో.. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి.

ఈ తీరులో దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకపోవటం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాల జాబితాలో ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. గుజరాత్.. మణిపూర్.. నాగాలాండ్.. సిక్కింలు ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. ఎన్నికల వేళ.. అధికార పక్షానికి తిరుగులేని మెజార్టీని ఓటర్లు కట్టబెట్టటం మామూలే అయినా.. ప్రతిపక్ష ఉనికిని కూడా చాటుతుంటారు. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశ ఓటర్లకు ఏమైంది? విపక్షం లేని అధికారపక్షాలు కొలువు తీరేలా ఎందుకు చేస్తున్నారు? అన్నది కచ్ఛితంగా ఫోకస్ చేయాల్సిన అంశంగా మారిందని చెప్పకతప్పదు.

This post was last modified on November 25, 2024 9:54 am

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

19 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago