Political News

దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు ఎన్నంటే?

ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త ధోరణి కనిపిస్తోంది. ఎన్నికలు జరిగినప్పుడు అధికార.. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చే ఓట్లు.. సీట్ల లెక్కలో తేడాలు ఉండొచ్చు. కానీ.. అంతిమంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షాన్ని ప్రజలు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ తీరు మారుతోంది.

పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు రావాల్సిన ఓట్లు.. సీట్లు రాని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు అధికార కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే.. విపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కటం తెలిసిందే.దీంతో.. ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం సీట్లు లేకపోవటంతో.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు.. తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది.మహారాష్ట్రలో అధికార పక్షంగా మహాయుతి అవతరించగా.. ప్రతిపక్షంగా మహా వికాస్ అఘాడీ నిలిచింది. అయితే.. ఈ కూటమిలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా పది శాతం సీట్లు రాలేదు. కూటమిలోని శివసేన (యూబీటీ) 20 సీట్లు.. కాంగ్రెస్ కు 16, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలువచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పది శాతం సీట్లు అంటే.. 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ.. విపక్షంలో నిలిచిన ఏ పార్టీకి ఆ స్థాయిలో సీట్లు రాకపోవటంతో.. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి.

ఈ తీరులో దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకపోవటం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాల జాబితాలో ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. గుజరాత్.. మణిపూర్.. నాగాలాండ్.. సిక్కింలు ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. ఎన్నికల వేళ.. అధికార పక్షానికి తిరుగులేని మెజార్టీని ఓటర్లు కట్టబెట్టటం మామూలే అయినా.. ప్రతిపక్ష ఉనికిని కూడా చాటుతుంటారు. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశ ఓటర్లకు ఏమైంది? విపక్షం లేని అధికారపక్షాలు కొలువు తీరేలా ఎందుకు చేస్తున్నారు? అన్నది కచ్ఛితంగా ఫోకస్ చేయాల్సిన అంశంగా మారిందని చెప్పకతప్పదు.

Kumar

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago