Political News

దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు ఎన్నంటే?

ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త ధోరణి కనిపిస్తోంది. ఎన్నికలు జరిగినప్పుడు అధికార.. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చే ఓట్లు.. సీట్ల లెక్కలో తేడాలు ఉండొచ్చు. కానీ.. అంతిమంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షాన్ని ప్రజలు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ తీరు మారుతోంది.

పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు రావాల్సిన ఓట్లు.. సీట్లు రాని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు అధికార కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే.. విపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కటం తెలిసిందే.దీంతో.. ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం సీట్లు లేకపోవటంతో.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు.. తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది.మహారాష్ట్రలో అధికార పక్షంగా మహాయుతి అవతరించగా.. ప్రతిపక్షంగా మహా వికాస్ అఘాడీ నిలిచింది. అయితే.. ఈ కూటమిలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా పది శాతం సీట్లు రాలేదు. కూటమిలోని శివసేన (యూబీటీ) 20 సీట్లు.. కాంగ్రెస్ కు 16, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలువచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పది శాతం సీట్లు అంటే.. 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ.. విపక్షంలో నిలిచిన ఏ పార్టీకి ఆ స్థాయిలో సీట్లు రాకపోవటంతో.. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి.

ఈ తీరులో దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకపోవటం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాల జాబితాలో ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. గుజరాత్.. మణిపూర్.. నాగాలాండ్.. సిక్కింలు ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. ఎన్నికల వేళ.. అధికార పక్షానికి తిరుగులేని మెజార్టీని ఓటర్లు కట్టబెట్టటం మామూలే అయినా.. ప్రతిపక్ష ఉనికిని కూడా చాటుతుంటారు. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశ ఓటర్లకు ఏమైంది? విపక్షం లేని అధికారపక్షాలు కొలువు తీరేలా ఎందుకు చేస్తున్నారు? అన్నది కచ్ఛితంగా ఫోకస్ చేయాల్సిన అంశంగా మారిందని చెప్పకతప్పదు.

This post was last modified on November 25, 2024 9:54 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago