ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంపై గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక విమర్శలు, వ్యాఖ్య లు వినిపించాయి. స్వామి వారికి భక్తులు ఇచ్చిన సొమ్మును దారి మళ్లిస్తున్నారని, ఆ సొమ్ములకు లెక్కలు కూడా చెప్పడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదేసమయంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేల చొప్పున సేకరించిన సొమ్మును కూడా లెక్కలు లేకుండా చేశారన్న విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కూటమి సర్కారు హయాంలోఇటీవల ఏర్పాటై టీటీడీ బోర్డు..శ్రీవారి నిధులకు సంబంధిం చి సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసింది. ఇదేసమయంలో ఈ ట్రస్టుకు వచ్చిన నిధులను కూడా స్వామి వారికి సొంత ఖాతాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇక, ఈ క్రమంలోనే తాజాగా.. మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు స్వామి వారి సొమ్ములను వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేసింది.
అయితే.. ఎక్కడెక్కడ ఎంత సొమ్ము జమ చేశారన్న వివరాలు లేకపోవడంతో ఇప్పుడు వాటిపై కూడా కూపీ లాగుతున్నారు. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎస్ బీఐ ఖాతా అధికారికంగా ఉంది. దీనికి తోడు మరోబ్యాంకు కూడా ఉంది. ఇవి కాదని వేరే బ్యాంకుల్లో నిధులు జమ చేశారు. ఈ క్రమంలో ఆయా ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేసిన సొమ్మును వెనక్కి తీసుకుని.. వాటిని ఎస్ బీఐ సహా.. తిరుమలకు లింకైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జమ చేయాలని నిర్ణయించారు.
ప్రైవేటు బ్యాంకులలో టిటిడి డిపాజిట్లపై విచారణకు ప్రత్యేక కమిటి వేయనున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత డిపాజిట్ చేశారన్న వివరాలను సేకరిస్తున్నారు. 2022 నవంబర్ లెక్కల ప్రకారం 19 బ్యాంకుల్లో రూ. 15,938 కోట్లు డిపాజిట్ చేసినట్లు టిటిడి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రైవేటు బ్యాంకుల నుంచి డిపాజిట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. తద్వారా.. స్వామి వారి సొమ్మును భద్రంగా ఉంచాలని నిర్ణయించినట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
This post was last modified on November 24, 2024 5:58 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…