Political News

శ్రీవారి సొమ్ములు భద్రం.. బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అనేక విమ‌ర్శ‌లు, వ్యాఖ్య లు వినిపించాయి. స్వామి వారికి భ‌క్తులు ఇచ్చిన సొమ్మును దారి మ‌ళ్లిస్తున్నార‌ని, ఆ సొమ్ముల‌కు లెక్క‌లు కూడా చెప్ప‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో శ్రీవాణి ట్ర‌స్టు ద్వారా రూ.10 వేల చొప్పున సేక‌రించిన సొమ్మును కూడా లెక్క‌లు లేకుండా చేశార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కారు హ‌యాంలోఇటీవ‌ల ఏర్పాటై టీటీడీ బోర్డు..శ్రీవారి నిధుల‌కు సంబంధిం చి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ్రీవాణి ట్ర‌స్టును ర‌ద్దు చేసింది. ఇదేస‌మ‌యంలో ఈ ట్ర‌స్టుకు వ‌చ్చిన నిధుల‌ను కూడా స్వామి వారికి సొంత ఖాతాల‌కు బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో ప‌నిచేసిన టీటీడీ బోర్డు స్వామి వారి సొమ్ముల‌ను వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో జ‌మ చేసింది.

అయితే.. ఎక్క‌డెక్క‌డ ఎంత సొమ్ము జ‌మ చేశార‌న్న వివ‌రాలు లేక‌పోవ‌డంతో ఇప్పుడు వాటిపై కూడా కూపీ లాగుతున్నారు. సాధార‌ణంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఎస్ బీఐ ఖాతా అధికారికంగా ఉంది. దీనికి తోడు మ‌రోబ్యాంకు కూడా ఉంది. ఇవి కాద‌ని వేరే బ్యాంకుల్లో నిధులు జ‌మ చేశారు. ఈ క్ర‌మంలో ఆయా ప్రైవేటు బ్యాంకుల్లో జ‌మ చేసిన సొమ్మును వెన‌క్కి తీసుకుని.. వాటిని ఎస్ బీఐ స‌హా.. తిరుమ‌ల‌కు లింకైన ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోనే జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ప్రైవేటు బ్యాంకులలో టిటిడి డిపాజిట్లపై విచారణకు ప్రత్యేక కమిటి వేయ‌నున్నారు. ఎక్క‌డెక్క‌డ ఎంతెంత డిపాజిట్ చేశార‌న్న వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. 2022 నవంబర్ లెక్కల ప్రకారం 19 బ్యాంకుల్లో రూ. 15,938 కోట్లు డిపాజిట్ చేసినట్లు టిటిడి అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రైవేటు బ్యాంకుల నుంచి డిపాజిట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. త‌ద్వారా.. స్వామి వారి సొమ్మును భ‌ద్రంగా ఉంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు టీటీడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

This post was last modified on November 24, 2024 5:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago