Political News

ఫాలోవర్స్ 56 లక్షలు..ఓట్లు 146

ఈ సోషల్ మీడియా జమానాలో యూబ్యూటర్లు, ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్లు, బ్లాగర్లూ ఎక్కువయ్యారు. ఆయా మాధ్యమాల్లో ఎంత ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్. ఆ క్రేజ్ వల్ల పాపులర్ అయి బిగ్ బాస్ కంటెస్టెంట్, సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసిన వారు కూడా ఉన్నారు. అయితే, ఆ క్రేజ్ వాడుకొని ఎన్నికల్లో గెలవాలనుకుంటే కుదరదన్న సంగతి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో 56 లక్షల మంది ఫాలోవర్లున్న నటుడు అజాజ్ ఖాన్ కు కేవలం 146 ఓట్లు వచ్చిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున వెర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యూపీలోని నగీనా ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌ 5.6 మిలియన్స్ (56 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్న అజాజ్ ఖాన్ గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.

అయితే, ఎన్నికల ఫలితాలు అజాజ్ ఖాన్ తో పాటు ఆయన ఫాలోవర్లకూ షాకిచ్చాయి. 56 లక్షల మంది ఫాలోవర్లున్న అజాజ్ ఖాన్ కు కేవలం 146 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన, ఆయన ఫాలోవర్లు ఖంగుతిన్నారు. అంతేకాదు, ఇక్కడ నోటాకు దాదాపు 750 ఓట్లు వచ్చాయి. దీంతో, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు ఓటర్లకు సంబంధం లేదని, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఫాలోవర్స్, క్రేజ్ ఉంటే రాజకీయాల్లో రాణిస్తానుకోవడం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

This post was last modified on November 23, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Ajaz khanNCP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago