Political News

ఫాలోవర్స్ 56 లక్షలు..ఓట్లు 146

ఈ సోషల్ మీడియా జమానాలో యూబ్యూటర్లు, ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్లు, బ్లాగర్లూ ఎక్కువయ్యారు. ఆయా మాధ్యమాల్లో ఎంత ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్. ఆ క్రేజ్ వల్ల పాపులర్ అయి బిగ్ బాస్ కంటెస్టెంట్, సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసిన వారు కూడా ఉన్నారు. అయితే, ఆ క్రేజ్ వాడుకొని ఎన్నికల్లో గెలవాలనుకుంటే కుదరదన్న సంగతి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో 56 లక్షల మంది ఫాలోవర్లున్న నటుడు అజాజ్ ఖాన్ కు కేవలం 146 ఓట్లు వచ్చిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున వెర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యూపీలోని నగీనా ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌ 5.6 మిలియన్స్ (56 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్న అజాజ్ ఖాన్ గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.

అయితే, ఎన్నికల ఫలితాలు అజాజ్ ఖాన్ తో పాటు ఆయన ఫాలోవర్లకూ షాకిచ్చాయి. 56 లక్షల మంది ఫాలోవర్లున్న అజాజ్ ఖాన్ కు కేవలం 146 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన, ఆయన ఫాలోవర్లు ఖంగుతిన్నారు. అంతేకాదు, ఇక్కడ నోటాకు దాదాపు 750 ఓట్లు వచ్చాయి. దీంతో, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు ఓటర్లకు సంబంధం లేదని, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఫాలోవర్స్, క్రేజ్ ఉంటే రాజకీయాల్లో రాణిస్తానుకోవడం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

This post was last modified on November 23, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Ajaz khanNCP

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

29 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

49 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago