అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలి ఎన్నికల్ని తెర మీదకు తీసుకొస్తారన్న ప్రచారాన్ని సింఫుల్ గా తేల్చేశారు ఏపీ సీఎం. జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ.. రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికలు మాత్రం యథావిధిగా సాగుతాయని చెప్పారు.
దేశంలో జమిలి వచ్చినా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు యథావిధిగా సాగుతాయని.. ముందస్తు ఎన్నికలు అంటూ ఏమీ ఉండవని స్పష్టం చేసిన చంద్రబాబు..విజన్ డాక్యుమెంట్ 2047అమలుపై నిరంతర పర్యవేక్షణ.. సమీక్ష ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. ‘విజన్’ లక్ష్యసాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా వినూత్న పథకాలకు తెర తీయనున్నట్లుగా పేర్కొన్నారు.
సెకితో సౌర విద్యుత్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్.. అదానీ నుంచి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారటూ అంమెరికాలో కేసు నమోదు చేసుకోవటం.. ఆ ఒప్పందం వల్ల రాష్ట ప్రజలపై ఆర్థిక భారాన్ని పడనుండటంతో ఈ ఒప్పందాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. ఒప్పందాల రద్దు అంశానికి వస్తే.. పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా.. ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్తిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)కి అప్పచెప్పినట్లుగా చంద్రబాబు వెల్లడించారు. మొత్తంగా ఏపీ రూపురేఖల్ని మార్చేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.మరి.. ఆయన ప్లానింగ్ ఎంతవరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 23, 2024 10:14 am
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…