ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు 20 బిల్లులను ఆమోదించారు. వీటిలో కీలకమైన రెండు బిల్లులను చంద్రబాబు తొక్కిపెట్టారు. అసలు ఈ రెండు బిల్లులనే ఆమోదించాలన్నది టీడీపీ నేతలు, మంత్రులు చెప్పిన మాట. కానీ, చంద్రబాబు మాత్రం ఆ రెండు తప్ప.. అంటూ వ్యాఖ్యా నించారు తర్వాత చూద్దామనికూడా పక్కన పెట్టేశారు. దీంతో తమ్ముళ్లు ఉసూరుమన్నారు.
ఏంటా బిల్లులు..?
1) స్థానిక సంస్థల్లో పాలనను రెండు సంవత్సరాలకు కుదించే బిల్లు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థల పాలనపై పట్టుంటుంది. ఈ విషయంలో సందేహం లేదు. నాలుగేళ్ల అనంతరం.. స్థానిక సంస్థలపై నిర్ణయం తీసుకునే వెలసుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీకి కూడా ఉంటుంది. సదరు సంస్థను రద్దు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశ పెట్టొచ్చు. ఇలానే ఇప్పుడు కూడా తమ్ముళ్లు స్థానిక సంస్థల అధికారాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.
ఇదే బిల్లును మంత్రి మండలిలోనూ చర్చించారు. అయితే.. దీనికి చంద్రబాబు అడ్డుకున్నారు. ప్రస్తుతం మరో ఏడాదన్నరే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలను ఖరాబు చేయొద్దన్నది ఆయ న సారాంశం. దీంతో సదరు బిల్లు బుట్టదాఖలైంది. అయితే.. దీనిని ఆమోదించాలని పలువురు మంత్రు లు కోరినా.. చంద్రబాబు ఒప్పుకోకపోవడం వెనుక.. వ్యూహం ఉంది. స్థానిక సంస్థలను బలవంతంగా తీసు కునే కన్నా.. గెలుచుకునే వ్యూహాలు అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.
2) గ్రామీణ ప్రాంతాల్లో వీధి లైట్లకు సంబంధించి సెస్సు విధించే బిల్లు. దీనిని కూడా చంద్రబాబు అడ్డు కున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీధిలైట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెస్సును విధించాలన్నది మంత్రులు చెబుతున్నమాట. కానీ, ఇలా చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయని.. ఆ బిల్లు అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. మొత్తంగా తమ్ముళ్లు కీలకమని భావించిన రెండు బిల్లులను చంద్రబాబు రద్దు చేశారు.
This post was last modified on November 22, 2024 11:44 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…