Political News

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డిని ఆమె టార్గెట్ చేశారు. ఆది నుంచి కూడా ఇరువురి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రింత ఎక్కువ అయ్యాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ప‌రిటాల కుటుంబాన్ని తోపుదుర్తి టార్గెట్ చేసుకుని రాజ‌కీయాలు చేసిన‌ట్టే.. ఇప్పుడు సునీత కూడా తోపుదుర్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు.

చ‌ర్య‌ల‌కు ప‌ట్టు..
తోపుదుర్తి 2019లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జాకీ అనే ప‌రిశ్ర‌మ ఏర్పాటును ఆయ‌న అడ్డుకున్నార‌న్న‌ది సునీత అప్ప‌ట్లోనే చేసిన విమ‌ర్శ‌. 129 కోట్ల రూపాయ‌లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల వ‌స్త్రాల‌ను తయారు చేసే పరిశ్రమగా జాకీ పేరు తెచ్చుకుంది. ఇది 2018లో ఏర్పాటైంది. అయితే.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది.

దీనికోసం 2014-19 మ‌ధ్య సునీత క‌ష్ట‌ప‌డ్డార‌నేది వాస్తవం. దీంతో తోపుదుర్తి ఉద్దేశ పూర్వ‌కంగా.. ఈ జాకీని తెలంగాణ‌కు త‌రిమేశార‌న్న‌ది ఆమె ఆవేద‌న.. దీనివెనుక రాజ‌కీయం ఉంద‌ని ఆందోళ‌న‌. ఈ క్ర‌మంలోనే తోపుదుర్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది సునీత చేస్తున్న డిమాండ్‌. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా సునీత కేటాయించేలా చేశారు. అయితే.. ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపణ‌.

ఈ నేప‌థ్యంలోనే జాకీ తెలంగాణకు తరలిపోయింది. ఈ క్ర‌మంలో తాము ఆందోళ‌న చేస్తే.. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారన్న‌ది కూడా సునీత ఆవేద‌న‌. దీంతో ఇప్పుడు తోపుదుర్తిపై చ‌ర్య‌ల‌కు ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌తో పాటు జాకీని తిరిగి తీసుకురావాల‌ని కూడా సునీత కోరుతున్నారు. ఒక‌వైపు స‌భ‌లోనూ.. మ‌రోవైపు ప‌ర్స‌నల్‌గా కూడా.. సునీత ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 22, 2024 11:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

28 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago