Political News

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డిని ఆమె టార్గెట్ చేశారు. ఆది నుంచి కూడా ఇరువురి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రింత ఎక్కువ అయ్యాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ప‌రిటాల కుటుంబాన్ని తోపుదుర్తి టార్గెట్ చేసుకుని రాజ‌కీయాలు చేసిన‌ట్టే.. ఇప్పుడు సునీత కూడా తోపుదుర్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు.

చ‌ర్య‌ల‌కు ప‌ట్టు..
తోపుదుర్తి 2019లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జాకీ అనే ప‌రిశ్ర‌మ ఏర్పాటును ఆయ‌న అడ్డుకున్నార‌న్న‌ది సునీత అప్ప‌ట్లోనే చేసిన విమ‌ర్శ‌. 129 కోట్ల రూపాయ‌లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల వ‌స్త్రాల‌ను తయారు చేసే పరిశ్రమగా జాకీ పేరు తెచ్చుకుంది. ఇది 2018లో ఏర్పాటైంది. అయితే.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది.

దీనికోసం 2014-19 మ‌ధ్య సునీత క‌ష్ట‌ప‌డ్డార‌నేది వాస్తవం. దీంతో తోపుదుర్తి ఉద్దేశ పూర్వ‌కంగా.. ఈ జాకీని తెలంగాణ‌కు త‌రిమేశార‌న్న‌ది ఆమె ఆవేద‌న.. దీనివెనుక రాజ‌కీయం ఉంద‌ని ఆందోళ‌న‌. ఈ క్ర‌మంలోనే తోపుదుర్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది సునీత చేస్తున్న డిమాండ్‌. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా సునీత కేటాయించేలా చేశారు. అయితే.. ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపణ‌.

ఈ నేప‌థ్యంలోనే జాకీ తెలంగాణకు తరలిపోయింది. ఈ క్ర‌మంలో తాము ఆందోళ‌న చేస్తే.. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారన్న‌ది కూడా సునీత ఆవేద‌న‌. దీంతో ఇప్పుడు తోపుదుర్తిపై చ‌ర్య‌ల‌కు ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌తో పాటు జాకీని తిరిగి తీసుకురావాల‌ని కూడా సునీత కోరుతున్నారు. ఒక‌వైపు స‌భ‌లోనూ.. మ‌రోవైపు ప‌ర్స‌నల్‌గా కూడా.. సునీత ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

3 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

4 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

6 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

7 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

9 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

9 hours ago