Political News

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డిని ఆమె టార్గెట్ చేశారు. ఆది నుంచి కూడా ఇరువురి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రింత ఎక్కువ అయ్యాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ప‌రిటాల కుటుంబాన్ని తోపుదుర్తి టార్గెట్ చేసుకుని రాజ‌కీయాలు చేసిన‌ట్టే.. ఇప్పుడు సునీత కూడా తోపుదుర్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు.

చ‌ర్య‌ల‌కు ప‌ట్టు..
తోపుదుర్తి 2019లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జాకీ అనే ప‌రిశ్ర‌మ ఏర్పాటును ఆయ‌న అడ్డుకున్నార‌న్న‌ది సునీత అప్ప‌ట్లోనే చేసిన విమ‌ర్శ‌. 129 కోట్ల రూపాయ‌లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల వ‌స్త్రాల‌ను తయారు చేసే పరిశ్రమగా జాకీ పేరు తెచ్చుకుంది. ఇది 2018లో ఏర్పాటైంది. అయితే.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది.

దీనికోసం 2014-19 మ‌ధ్య సునీత క‌ష్ట‌ప‌డ్డార‌నేది వాస్తవం. దీంతో తోపుదుర్తి ఉద్దేశ పూర్వ‌కంగా.. ఈ జాకీని తెలంగాణ‌కు త‌రిమేశార‌న్న‌ది ఆమె ఆవేద‌న.. దీనివెనుక రాజ‌కీయం ఉంద‌ని ఆందోళ‌న‌. ఈ క్ర‌మంలోనే తోపుదుర్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది సునీత చేస్తున్న డిమాండ్‌. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా సునీత కేటాయించేలా చేశారు. అయితే.. ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపణ‌.

ఈ నేప‌థ్యంలోనే జాకీ తెలంగాణకు తరలిపోయింది. ఈ క్ర‌మంలో తాము ఆందోళ‌న చేస్తే.. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారన్న‌ది కూడా సునీత ఆవేద‌న‌. దీంతో ఇప్పుడు తోపుదుర్తిపై చ‌ర్య‌ల‌కు ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌తో పాటు జాకీని తిరిగి తీసుకురావాల‌ని కూడా సునీత కోరుతున్నారు. ఒక‌వైపు స‌భ‌లోనూ.. మ‌రోవైపు ప‌ర్స‌నల్‌గా కూడా.. సునీత ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 22, 2024 11:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

22 seconds ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago