విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శానస మండలి సమావేశాల సందర్భంగా వైసీపీ. కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గతంలో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ చెప్పారు. ఈ విషయంపై అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంట్ తో ఉన్నామని స్పష్టం చేశారు.
ఇంకా చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టాలని, ఢిల్లీకి వెళ్లి మాట్లాడదామని వైసీపీ ప్రభుత్వాన్ని తాము అభ్యర్థించామని పవన్ గుర్తు చేశారు.
కానీ, వారు తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఈ రోజు సభ దృష్టికి తీసుకురావాదలుచుకున్నానని పవన్ అన్నారు. ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ స్పందించారు.
ఆ రోజు ప్రభుత్వానికి సింగిల్ గానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉందని, కాబట్టే ఆల్ పార్టీ డెలిగేషన్ అవసరం రాలేదని బొత్స అన్నారు. అన్ని పార్టీలను కలుపుకే పరిస్థితి తమకు ఉత్పన్నం కాలేదని చెప్పారు. తమ ప్రభుత్వానికి శక్తి లేనప్పుడే ఆల్ పార్టీ డెలిగేషన్ అవసరమని తెలిపారు.
సింగిల్ గా ఆపగలిగే శక్తి తమకుంది అని బొత్స చేసిన కామెంట్లు విన్న కూటమి సభ్యులంతా కేకలు వేస్తూ నవ్వుకున్నారు. బొత్స కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ స్టీల్..ఎనీ ‘సెంటర్’ సింగిల్ హ్యాండ్ అంటోన్న బొత్స అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ సింహంలా సింగిల్ గా వస్తుందని ఊదరగొట్టి 11 సీట్లకే చతికిలబడ్డారని సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on November 21, 2024 2:18 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…