Political News

ఒంటి చేత్తో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాం: బొత్స

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శానస మండలి సమావేశాల సందర్భంగా వైసీపీ. కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గతంలో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ చెప్పారు. ఈ విషయంపై అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంట్ తో ఉన్నామని స్పష్టం చేశారు.

ఇంకా చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టాలని, ఢిల్లీకి వెళ్లి మాట్లాడదామని వైసీపీ ప్రభుత్వాన్ని తాము అభ్యర్థించామని పవన్ గుర్తు చేశారు.

కానీ, వారు తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఈ రోజు సభ దృష్టికి తీసుకురావాదలుచుకున్నానని పవన్ అన్నారు. ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ స్పందించారు.

ఆ రోజు ప్రభుత్వానికి సింగిల్ గానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉందని, కాబట్టే ఆల్ పార్టీ డెలిగేషన్ అవసరం రాలేదని బొత్స అన్నారు. అన్ని పార్టీలను కలుపుకే పరిస్థితి తమకు ఉత్పన్నం కాలేదని చెప్పారు. తమ ప్రభుత్వానికి శక్తి లేనప్పుడే ఆల్ పార్టీ డెలిగేషన్ అవసరమని తెలిపారు.

సింగిల్ గా ఆపగలిగే శక్తి తమకుంది అని బొత్స చేసిన కామెంట్లు విన్న కూటమి సభ్యులంతా కేకలు వేస్తూ నవ్వుకున్నారు. బొత్స కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ స్టీల్..ఎనీ ‘సెంటర్’ సింగిల్ హ్యాండ్ అంటోన్న బొత్స అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ సింహంలా సింగిల్ గా వస్తుందని ఊదరగొట్టి 11 సీట్లకే చతికిలబడ్డారని సెటైర్లు వేస్తున్నారు.

This post was last modified on November 21, 2024 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

2 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

6 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

6 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

8 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

10 hours ago